ప్రజా దీవెన, నల్గొండ టౌన్:నల్గొండ పట్టణం 17వ వార్డులో బూత్ నెంబర్ 159 కు బూత్ కమిటీ ఎన్నిక*బూత్ కమిటీలే పార్టీకి పునాదిగా న ..
రాబోయే ఎన్నికల్లో నల్గొండ మున్సిపాలిటీని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వేమిరెడ్డి భిక్షంరెడ్డి తెలిపారు.
నల్గొండ పట్టణంలో 17వ వార్డులో వేమిరెడ్డి బిక్షం రెడ్డి గారి ఆధ్వర్యంలో 159 బూత్ కు సంబంధించి బూత్ కమిటీ ఎన్నిక నిర్వహించడం జరిగిందని తెలిపారు భూత అధ్యక్షులుగా శ్రవణ్ ను ఎన్నుకున్నారు..
ఈ కార్యక్రమానికి బిజెపి కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా పాల్గొని బూత్ అధ్యక్షుడిని అభినందిస్తూ బూత్ పరిధిలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా ముందుండాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి, జిల్లా సభ్యత్వ ప్రాముఖ్ కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, వార్డు సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.