West Zone Preord: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: జాతీయ సేవా పథకం (National Service Scheme)సమన్వ యకర్త డాక్టర్ మద్దిలేటి పసుపుల అధ్యక్షతన మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వెస్ట్ జోన్ ప్రిఆర్డి (West Zone Preord) ఎంపికలు జరిగాయి. ఈ ఎంపికలకు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాల విద్యార్థి విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఎంపికకు హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ ఎం రామకృష్ణ గారు, శ్రీ నరసింహ గారు, ఎన్ఎస్ఎస్ రీజినల్ డైరెక్టర్ ఆఫీస్ ఇంచార్జ్ సంజయ్ గారు విద్యార్థి విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చి మొదటగా విద్యార్థిని విద్యార్థులకు పరుగు పందెం నిర్వహించి దానిలో ఉత్తీర్ణత సాధించిన వారికి మధ్యాహ్నం రాష్ట్రం అంశాలు, సంస్కృతిక కార్యక్రమాల పై అవగాహన విద్యార్థిని విద్యార్థులకు ఇంట ర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ ఎంపికైన విద్యార్థులు (The students) మహారాష్ట్ర జనగాం లోని విశ్వవిద్యాల యం లో పాల్గొంటా రు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ పరిధిలో ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు. ఈ ఎంపికలకు సంబంధించిన ప్రక్రియను హైదరాబాద్ రీజినల్ డైరెక్టరేట్ స్టేట్ ఎన్ఎస్ఎస్ ఆఫీసు లో ఈ ప్రక్రియను పూర్తి చేసి తుది ఫలితాలను వెల్లడిస్తారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.