Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Lok sabha elections: యువత మోడీనే కావాలని కోరుకుంటుంది

యువత మొత్తం నరేంద్ర మోడీ నే మళ్లీ ప్రధాని కావాలి అని కోరుకుంటున్నారు.

హామీల అమలు లో కాంగ్రెస్ విఫలం

నేను రాజకీయాలకు వచ్చిందే యువత కోసం

కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి

ప్రజా దీవెన నల్లగొండ: యువత మొత్తం నరేంద్ర మోడీ (Narendra Modi)నే మళ్లీ ప్రధాని కావాలి అని కోరుకుంటున్నారు.ఈ సారి కూడా ప్రధానమంత్రిని చేస్తామంటున్నారు.ఈ దేశం బాగుపడాలంటే అభివృద్ధి ఆగకుండా ఉండాలంటే మళ్లీ మోడీ నే ప్రధాని కావాలని
నల్లగొండ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి(Saidireddy)అన్నారు.

సోమవారం మిర్యాలగూడ(Miryalaguda)పట్టణంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రైతు సమ్మేళన సమావేశం లో పాల్గొని మాట్లాడారు. కుల మతాలకు అతీతంగా కమలం పువ్వు గుర్తుపై ఓటు(Vote) వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 130 రోజులు కావస్తున్న ఇంతవరకు రైతుబంధు, రెండు లక్షల రుణమాఫీ గాని, వృద్ధులకు రూ.2000 నుండి రూ.4000 వరకు పింఛను కానీ అమలు చేయలేదని ఆరోపించారు.

రేషన్ కార్డులు(Ration cards)ఇవ్వకుండా కల్లబొల్లి మాటలు చెప్పుకుంటా పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం సంవత్సరానికి 6 వేల చొప్పున 3 విడతలుగా రైతులకి బ్యాంక్ ఖాతాలోకి వేస్తోందని అన్నారు.

యూరియా, డీఏపీ మీద ఎకరానికి 18 వేల రూపాయలు సబ్సిడీ అందిస్తుందని, ప్రపంచం మొత్తం దేశం వైపు చూసే విధంగా పని చేస్తున్నారని కొడియాడారు.
ఒక అవినీతి మచ్చ లేకుండా పనిచేస్తున్న నరేంద్ర మోడీ కావాలా, తేల్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేను రాజకీయాల్లోకి వచ్చింది యువత ఉద్యోగాల కల్పన కోసం, కచ్చితంగా 50,000 ఉద్యోగాలు కలిపిస్తానని హామీ ఇచ్చారు. జరిగే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.

Youth want modi once again as PM