Election polling: చివరిదశకు ఎన్నికల ప్రచారం
లోక్ సభ సార్వత్రిక ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. దేశ వ్యాప్తంగా గురువారంతో ఎన్నికల ఎన్నికల ప్రచారం ముగియనుంది.
నేడు ముగియనున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారాలు
సాయంత్రం కన్యాకుమారికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
వివేకానంద రాక్ పై ధ్యానముద్ర వహించనున్న మోదీ
ప్రజా దీవెన, కన్యాకుమారి: లోక్ సభ సార్వత్రిక ఎన్నికల(Lok Sabha General Elections) ప్రచారం తుది దశకు చేరుకుంది. దేశ వ్యాప్తంగా గురువారంతో ఎన్నికల ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఏడోదశ ఎన్నికలు జూన్ 1న జరుగ నున్నాయి. ఇందులో భాగంగా గురువారం ప్రధాని మోడీ(Prime Minister Modi) పోటీ చేస్తున్న వారణాసి లో చివరి ఎన్నికల ప్రచారం నిర్వహించను న్నారు.ఈ క్రమంలో ప్రచారం ముగిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ కన్యాకుమారిలో(Kanyakumari) సేదదీర నున్నారు. మోడీ సందర్శన ను పురస్కరించుకుని కన్యాకుమారిలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన భద్రత కోసం 2,000 మంది పోలీసులు, వివిధ భద్రతా ఏజెన్సీ లతో మోహరించనున్నారు. స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానం చేసేందుకు ప్రధాని మోడీ గురువారం కన్యాకుమారి రాను న్నారు.
2019లో కూడా ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ప్రధాని మోడీ కేదార్ నాథ్ గుహలో ధ్యానంలో కూర్చున్నారు. మే 30న లోక్ సభ ఎన్నికల ప్రచారం పరిస మాప్తం అయిన సందర్భంగా ప్రధాని మోడీ వివేకానంద రాక్ మెమోరి యల్ వద్ద ధ్యానం చేస్తారని బిజెపి(BJP) నాయకులు తెలిపారు. మే 30 సాయంత్రం నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం వరకు ధ్యాన మండపం వద్ద 45 గంటల పాటు ధ్యానం చేస్తారని వారు తెలిపారు. ప్రఖ్యాత హిందూ ధర్మ ప్రచారకుడు, సాధు వు స్వామి వివేకానంద(Swami Vivekananda)ఈ ధ్యాన మండపంలోనే భారత మాత గురించి తన దార్శనికతను పొందా రని ప్రజలు విశ్వసిస్తారు. మోడీ కన్యాకుమారి సందర్శనను పురస్క రించుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు.
రాక్ మెమోరియల్, బోట్ జెట్టీ, హెలిప్యాడ్, ప్రభుత్వ అతిథి గృహం వద్ద భద్రతా ఏర్పాట్లను తిరునల్వేలి రేంజ్ డిఐజి ప్రవేష్ కుమార్, ఎస్పి ఇ సుందరవదనం బుధవారం పర్యవేక్షించారు. ప్రధాని కి చెందిన ప్రత్యేక భద్రతా బృందం కూడా ధ్యాన మండపం చేరుకుని భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసింది. హెలికాప్టర్ ల్యాండింగ్(Helicopter landing) పరీక్షలను కూడా జరిపింది. అంతర్జాతీయ పర్యాటక పటంలో ఉన్న కన్యా కుమారి, చుట్టుపక్కల దాదాపు 2,000 మంది పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. మొత్తానికి దేశ వ్యాప్తంగా ఏడు దశల సార్వత్రిక ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుండగా దేశ వ్యాప్తంగా మైకులు మూగబోను న్నాయి. జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
7th phase lok sabha election polling