Amit shah Fake video:అమిత్ షా అలజడి
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా కొనసాగుతున్న తరుణంలో తెలం గాణలో అమిత్ షా అలజడి ఆరంభమైంది.
ఫేక్ వీడియో ఎఫెక్ట్ సీఎం రేవంత్ కు సమన్లు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీప్ఫేక్ వీడియో కేసు
హైదరాబాద్ కు విచ్చేసిన డిల్లీ పోలీసులు
ఉపయోగించిన ఫోన్లు,ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో రావాలని సూచన
నోటీసులకు భయపడేది లేదన్న రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ను కోర్టుకీడుస్తామ న్న కిషన్రెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల(Lok Sabha elections)ప్రచారంలో ముమ్మరంగా కొనసాగుతున్న తరుణంలో తెలం గాణలో అమిత్ షా అలజడి ఆరంభమైంది. సామాజిక మాధ్యమాల్లో లోక్ సభ ఎన్నికల ఎత్తులు పై ఎత్తులు చక్కర్లు కొట్ట డం సహజమే అని అందరికీ తెలి సిందే. అయితే తాజాగా సాక్షాత్తు కేంద్ర హోo మంత్రి అమిత్ షా కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం వివాదమైంది.
అందరూ చర్చించు కుంటున్నట్లుగానే ఫేక్ వీడియో అని నిర్ధారణకు వచ్చి పోలీసులు కేసులు పెట్టే వరకు వెళ్లిందంటే సోషల్ మీడియా పరిస్థితి ఇంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ చ్చు. రిజర్వేషన్లు రద్దుచేస్తామంటూ అమిత్షా(Amit Shah)చెప్పినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన డీప్ ఫేక్ వీడియో కేసు దర్యాప్తు కు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని విచారించాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు.
సోమ వారం ఈ మేరకు రేవంత్రెడ్డి(Revanth Reddy) కి నోటీసులు కూడా జారీ చేశారు. బుధవారం ఉదయం 10.30కు ఢిల్లీలోని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటెజిక్ ఆపరేషన్స్ సెల్ ఇన్స్పెక్టర్ నీరజ్ చౌదరి ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొ న్నారు. విచారణకు హాజరయ్యే సమయంలో రేవంత్ వినియోగించే మొబైల్ ఫోన్తో పాటు అన్ని ఎల క్ట్రానిక్ ఉపకరణాలను తీసుకురా వాలని సూచించారు.
రేవంత్ తో పాటు అమిత్షా ఫేక్ వీడియోను షేర్ చేసిన మరో నలుగురు కాంగ్రెస్ నేతలకు కూడా ఢిల్లీ పోలీసులు స మన్లు జారీ చేశారు. వీరిలో కాంగ్రెస్(Congress) సోషల్ మీడియా ఇన్చార్జి మన్నె సతీశ్, సోషల్ మీడియా బృందం లోని నవీన్, శివకుమార్, తెలం గాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అ స్మా తస్లీమ్ ఉన్నారు. వీరికి సంబం ధించిన సమన్లను గాంధీ భవన్లో టీపీసీసీ లీగల్సెల్ చైర్మన్ రామ చంద్రారెడ్డికి అందజేశారు.
ఈ సం దర్భంగా కాంగ్రెస్ సోషల్ మీడియా, లీగల్టీమ్తో చర్చించారు. కాగా అమిత్షా ఫేక్ వీడియోను సీరియ స్గా తీసుకున్న బీజేపీ,(BJP) కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారం భించారు.వివిధ వర్గాల మధ్య సామరస్యాన్ని దెబ్బతీసి, శాంతి భద్రతలకు భంగం కలిగించే ఉద్దే శంతోనే ఈ నకిలీ వీడియోలను వ్యాప్తి చేశారని బీజేపీ, కేంద్ర హోంశాఖ లు భావిస్తున్నాయి.
తొలుత తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ ఖాతా నుంచి ఈ ఫేక్ వీడియోను వ్యాప్తి చేశారని, తర్వాత అనేకమం ది దాన్ని రీషేర్ చేశారని ఢిల్లీ పోలీ సులు తమ ఎఫ్ఐఆర్లో వెల్ల డిం చారు. ఈ కేసులో ఇప్పటికే అసోం రాజధాని గువాహటికి చెందిన రీ తంసింగ్ అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసు లు అరెస్టు చేశారు. ఆయన నుంచి రెండు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్ను సీజ్ చేశారు. గువాహటి హైకోర్టు న్యాయవాది అయిన రీతంసింగ్ అసోం కాంగ్రెస్ ఎన్నికల వార్రూమ్ సమన్వయకర్త అని అమిత్షా డీప్ ఫేక్ వీడియో ను సృష్టించింది అతనేనని పోలీసులు స్పష్టం చేశారు.
తెలంగాణలో ము స్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించ డం రాజ్యాంగ విరుద్ధమని, తాము దాన్ని తొలగిస్తామని అమిత్షా ఎ ప్పుడో చెప్పిన ఓ వీడియోను ఎడిట్ చేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల ను పూర్తిగా తొలగిస్తామని మార్చా రని వివరించారు. అయితే రీతం సింగ్ తన వ్యక్తిగత ఎక్స్ ఖాతా నుంచి అమిత్ షా ఫేక్ వీడియోను పంచుకున్నారే తప్ప అసోం కాంగ్రెస్ అధికారిక ఖాతా నుంచి కాదని ఆ రాష్ట్ర పీసీసీ ప్రతినిధి మెహ్దీఅలన్ బోరా వెల్లడించారు.
కాగా కర్ణాట కలో(Karnataka) మాజీ ప్రధాని దేవెగౌడ మనవ డు, హసన్ ఎంపీగా పోటీచేస్తున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక ఆరోపణల కేసును పక్కదోవ పట్టించేందుకే నోటీసులను పంపా రని టీపీసీసీ సోషల్ మీడియా ఇన్ చార్జి మన్నె సతీశ్ విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారి యర్స్కు ఢిల్లీ పోలీసుల ద్వారా నోటీసులు జారీ చేయించారని టీపీ సీసీ లీగల్ సెల్ చైర్మన్ రామచంద్రా రెడ్డి విమర్శించారు. తమ సోషల్ మీడియా వారియర్లు తప్పు చేయ బోరన్నారు.
నవీన్, మన్నె సతీశ్, శివశంకర్, అస్మా తస్లీమ్లకు నోటీ సులు ఇవ్వడానికి ఢిల్లీ ఇన్స్పెక్టర్ నీరజ్ చౌదరి గాంధీ భవన్కు వచ్చారని ఆ నోటీసులను తానే తీసుకున్నానని చెప్పారు. సమాధానానికి 15 రోజులు గడువు కోరినట్లు వెల్లడించారు. ఎఫ్ఐ ఆర్ను పూర్తిగా అధ్యయనం చేశాక ముందుకు వెళ్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు గెలుస్తుందనే బీజేపీ వాళ్లు ఈ కుట్రలు చేస్తున్నా రని ఆరోపించారు.
రేవంత్ను న్యాయస్థానానికి ఈడుస్తాం: కిషన్రెడ్డి
అమిత్షా వ్యాఖ్యలను వక్రీకరించి డీప్ఫేక్ వీడియో చేసిన ఘటనలో సీఎం రేవంత్రెడ్డిని కోర్టుకీడుస్తా మని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి(Kishan Reddy) ప్రకటిం చారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల తో మాట్లాడుతూ హోంమంత్రి వీడి యోను డీప్ఫేక్ చేయడం కంటే ఘోరమైన నేరం ఇంకోటి ఉండదని వ్యాఖ్యానించారు. ఈ ఉదంతాన్ని రాజకీయ కోణంలో చూడలేమని, ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని, ఉద్రిక్తతలను రెచ్చగొట్టి, శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
ఏమాత్రం నైతికత ఉన్నా రేవంత్రె డ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధా రాల్లేకుండా ఓ ముఖ్యమంత్రి మా ట్లాడడం దుర్మార్గమన్నారు. వాగ్దా నాలను తప్పిన కాంగ్రెస్ను ప్రజలు నమ్మడం లేదని, అందుకే అబద్ధా లతో గెలిచేందుకు కుట్రలు చేస్తోం దని ఆరోపించారు. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ వాటికి తోడు గా మజ్లిస్ కుమ్మక్కై బీజేపీపై తప్పు డు ప్రచారం చేస్తున్నారని మండిప డ్డారు.
Amit shah fake video case on Revanth reddy