Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Amit shah: అసహనంతోనే దుష్ప్రచారం అందుకే ఫేక్ వీడియోలు

దేశంలో కాంగ్రెస్ పార్టీ అసహనంతో కొట్టు మిట్టాడుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానిం చారు.

ఫేక్ వీడియోలతో బురదజల్లే ప్రయత్నం
మత ఆధారిత రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం
దుష్ప్రచారం వెనుక రాహుల్ హస్తం
కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశంలో కాంగ్రెస్(Congress) పార్టీ అసహనంతో కొట్టు మిట్టాడుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit shah) వ్యాఖ్యానిం చారు. సదరు అసహనంతోనే కాంగ్రెస్ పార్టీ ఫేక్ వీడియోలను తయారు చేస్తోందని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన మాటలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత ఆధారిత రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని పునరుద్ఘాటించారు.

400 సీట్లు దక్కించుకున్న తర్వాత బీజేపీ(BJP) రిజర్వేషన్లను రద్దు చేస్తుం దంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, ఆ మాటలన్నీ నిరాధా రమైనవని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు మా పార్టీ మద్దతు నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నాతోపాటు మా పార్టీకి చెందిన ఇతర నేతల ఫేక్ వీడియో(Fake video) లను ప్రచారం చేసే స్థాయికి కాంగ్రెస్ పార్టీ వారి అసహనం పెరిగిపోయిం దని, ముఖ్యమంత్రులు,ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఇతరులు ఈ ఫేక్ వీడియోలను వ్యాప్తి చేశారని ఆరోపించారు.

ప్రస్తుతం ఆ పార్టీకి చెందిన ఒక ప్రముఖనేత క్రిమినల్ నేరాన్ని ఎదుర్కొంటున్నారని, ఇవ న్నీ వారి అసంతృప్తిని వెల్లడిస్తున్నా యని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ(Rahul gandhi) కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి రాజకీయాలను మరిం త దిగజార్చేపనిలో నిమగ్నమ య్యారని, ఈ తరహా దృశ్యాలను ప్రచారం చేసి, ప్రజల మద్దతు కూడ గట్టుకునే ప్రయత్నం చేయడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని ఖండించారు. ఏ ప్రధాన పార్టీ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడ కూడదని ఆయన అన్నారు.

సదరు ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.. కర్ణాటకలో(Karnataka) తమ మిత్రపక్షం జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించి నవిగా చెబుతున్న అభ్యంతరకర వీడియోల ఘటనపై స్పందిస్తూ దేశంలో మేం మాతృశక్తికి అండగా నిలబడతామన్నది స్పష్టం. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలే దు అది ఆ రాష్ట్ర శాంతిభద్రతల అంశo, మేం విచారణకు అనుకూ లంగా ఉన్నామని, ఆ ఘటనపై చర్యలు తీసుకుంటామని జేడీఎస్ కు కూడా ఇప్పటికే తెలియజే శామని పేర్కొన్నారు.

ఉత్తరప్రదే శ్లోని అమేథీ, రాయబరేలీలో రాహుల్, ప్రియాంక పోటీ గురించి అడగ్గా వారు బరిలో ఉంటారా లేదా అనేది తెలియదని, అయితే వారిలో గందరగోళం చూస్తుంటే ఆత్మవిశ్వాసం లేనట్లు కనిపిస్తోం దని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ అగ్రనేతలు సొంత సీట్లను వదిలి పారిపోయిన పరిస్థితి ఉందని అమిత్ షా వ్యాఖ్యానించారు.

Amit Shah Fake videos viral