Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Amit Shah : భద్రతా దళాల భారీ విజయం

— ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందన

Amit Shah : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: చత్తీస్ ఘడ్ భారీ ఎన్కౌంటర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పం దించారుబీజాపూర్ లో కాల్పుల మోత 31 మంది నక్సల్స్ మృతి చెందగా ఇద్దరు జవాన్ల మరణం పొందారని పేర్కొన్నారు. భద్రతా బలగాలకు ఇది అతి పెద్ద విజయం అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. తాజా ఎన్ కౌంటర్ ద్వారా మావో యిస్టులకు అతి భారీ నష్టం జరి గిందన్నారు. ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో 31 మంది నక్సల్స్ మృతి చెందారు. బీజాపూర్ జిల్లా లో జరిగిన ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు జవాన్లు కూడా మరణిం చారు. ఈ ఎన్ కౌంటర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఆయన ట్వీట్ యధావిధిగా “భారత్ ను నక్సల్స్ రహిత దేశంగా మార్చే దిశగా భద్రతా బలగాలు బీజాపూర్ లో అతి పెద్ద విజయం సాధించాయి. ఈ ఆపరేషన్ లో 31 మంది నక్సలైట్లు మరణించారు. భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి” అని అమిత్ షా సోషల్ మీడియాలో వివరించారు.

ఎన్ కౌంటర్ లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందడంపై అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. మానవ వ్యతిరేక నక్సలిజంను అంతమొందించ డంలో ఇద్దరు ధైర్యశీలురైన జవా న్లను కోల్పోయామని తెలిపారు. ఇటువంటి అమరవీరులకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. మరణించిన జవా న్లకుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని అమిత్ షా వివరించారు. ఇక, 2026 మార్చి 31 లోపే దేశంలో నక్సలిజంను రూపుమాపుతామని పునరుద్ఘాటించారు. తద్వారా దేశంలో ఏ పౌరుడు నక్సలిజం కారణంగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు.కాగా, ఈ ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో పలువురు మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నారని ప్రచా రం జరుగుతోంది. దీనికి సంబంధిం చిన కచ్చితమైన సమాచారం తెలియాల్సి ఉంది.