Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ban on Medicine : కేంద్రం కీలక నిర్ణయం, పెయిన్ కిల్ల ర్స్, డయాబెటిస్ సహా 35 రకాల మెడిసిన్‌పై నిషేధం

Ban on Medicine : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశంలో 35 రకాల మెడిసిన్ ఉత్పత్తి నిలిపివే యడంతో పాటు వాటి విక్రయాలు సైతం జరపకూడదని నిర్ణయం తీ సుకుంది కేంద్ర ప్రభుత్వం. పెయిన్ కిల్లర్, డయాబెటిస్ లాంటి అనారో గ్య సమస్యలకు వినియోగించే అ నుమతి లేని దాదాపు 35 రకాల మెడిసిన్ పై నిషేధం విధిస్తూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఆదేశిం చింది. ఈ సంస్థ సూచన మేరకు అ నుమతి లేని మెడిసిన్ రకాలపై ని షేధం విధిస్తూ డీసీజీఐ లేఖ ద్వారా హెచ్చరించింది.

అందులో పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్, డయాబెటిస్, హైపర్ టెన్షన్ డ్రగ్స్, నరాలకు సంబంధిం చిన డ్రగ్స్, గర్భధారణ మెడిసిన్, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ లాంటివి ఆ 35 రకాల మెడిసిన్లలో ఉన్నాయని సంస్థ తెలిపిందని సమాచారం. ఆ మెడిసిన్ ఉత్పత్తి తక్షణమే నిలిపి వేయడంతో పాటు వాటి విక్రయా లు సైతం జరపరాదని అన్ని రాష్ట్రా లు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదే శాలు జారీ అయ్యాయి.

సరైన ప్రమాణాలు, సేఫ్టీ నిర్ధా రణ లేని వాటిపై నిషేధం కొన్ని మెడిసిన్లలో ఒకటి కంటే ఎక్కువ డ్రగ్ కాంబినేషన్ (FDC) ఉంటుం ది. అలా ఒకే మెడిసిన్ ఒకటి కంటే ఎక్కువ రకాల సప్లిమెంట్ కలిపే మందులను “కాక్టెయిల్” మెడిసిన్ అని పిలుస్తారు. CDSCO సంస్థ సూచనలతో డ్రగ్ కంట్రోలర్ జనర ల్ ఆఫ్ ఇండియా (DCGI) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతా లను ఆమోదించని FDCల తయా రీతో పాటు మార్కెటింగ్ నిలిపివే యాలని లేఖ రాసింది.

ప్రజల ఆరోగ్యం, మెడిసిన్ సమర్థ తపై సమీక్షలు నిర్వహించి అధికా రులు గతంలో లైసెన్స్ ఇచ్చిన 35 ఆమోదించని కొన్ని FDC ల జాబి తాను సిద్ధం చేసి ఆ కంపెనీలకు షో కాజ్ నోటీసులు జారీ చేశారు. శా స్త్రీయ నిర్ధారణ లేని మెడిసిన్ పేషెంట్ల ప్రాణాల మీదకు తెస్తుం దని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సంస్థ పేర్కొంది.

మొదట సీడీఎస్‌సీఓ భద్రతా, సమ ర్థత సమీక్షలు జరపకుండా రాష్ట్రా లు కొన్ని కాంబినేషన్ మెడిసిన్లకు పర్మిషన్ ఇచ్చాయి. ఆపై అన్ని రకా ల మెడిసిన్ ఉత్పత్తులపై పరీక్షలు నిర్వహించి వాటి సమర్థత పరీక్షిం చిన తరువాత వాటిని వినియోగిం చాలని DCGI చెబుతోంది. ఏప్రిల్ 11న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాం తాలకు డీసీజీఐ రాసిన లేఖను న్యూస్ 18 రిపోర్ట్ చేసింది. ఆ లేఖ ప్రకారం.. DCGI కి చెందిన రాజీవ్ సింగ్ రఘువంశీ ‘ప్రజల ఆరోగ్యం, వారి ప్రాణాలకు ముప్పు కలిగిస్తుం దని హెచ్చరించారు. ఇది అత్యవస ర, తీవ్రమైన అంశంగా పరిగణించా లని లేఖలో స్పష్టం చేశారు.

తాజా లేఖ సారాంశం ఇదే…
కొన్ని రకాల FDC మందులు సరైన సేఫ్టీ, స్టాండర్డ్ కలిగి లేవని CDS CO గుర్తించింది. సరైన నిర్ధారణ పరీక్షలు జరపకుండానే అనుమ తులు ఇచ్చినట్లు గుర్తించి మమ్మ ల్ని అలర్ట్ చేయగా చర్యలు ప్రారం భించాం. ‘డ్రగ్స్ & కాస్మెటిక్స్ చట్టం 1940 కింద NDCT రూల్స్ 2019 నిబంధనల ప్రకారం ముందస్తుగా సేఫ్టీ, స్టాండర్డ్ అంచనా వేయకుం డానే కొన్ని రకాల ఫిక్స్‌డ్ డోస్ కాం బినేషన్ (FDC) ఔషధాల తయారీ, పంపిణీ, విక్రయాలకు లైసెన్స్ పొం దారని డీసీజీఐ దృష్టికి వచ్చింది. అలాంటి మెడిసిన్ వాడితే ప్రాణాం తకం కావొచ్చు. శాస్త్రీయ నిర్ధారణ లేని మెడిసిన్ వల్ల ఎదురయ్యే పరి ణామాలు తీవ్రంగా ఉండనున్నా యి.

నియమ ఉల్లంఘనే అసలు కారణం …పలు రాష్ట్రాలు సరైన నియమ నిబంధనలు పాటించకుం డా ఈ మెడిసిన్లకు అనుమతి ఇచ్చి నందున గందరగోళానికి దారితీసిం ది. కొన్ని కంపెనీలు షాకోజ్ నోటీసు లకు స్పందించి తమ ఉత్పత్తులను పరీక్షించాయి. ఈ లైసెన్సులను సం బంధిత డ్రగ్ లైసెన్సింగ్ అధికారు లు మంజూరు చేశారని పేర్కొన్నా యి. దాంతో దేశవ్యాప్తంగా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940 కింద NDCT రూల్స్ 2019 నిబంధనను ఒకే విధంగా అమలు చేయడం లే దని గుర్తించామని DCGI అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత డ్రగ్ కంట్రో లర్లకు రాసిన లేఖలో పేర్కొంది. ని యమ, నిబంధనలకు కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.