Big Breaking News : ప్రజా దీవెన, అహ్మాదాబాద్: గుజరా త్లో అక్రమంగా ఉంటున్న సుమా రు 450 మంది బంగ్లాదేశీ శరణార్థు లను అరెస్టు చేశారు అక్కడి పోలీ సులు. అహ్మదాబాద్ సిటీలో నిర్వ హించిన కూంబింగ్ ఆపరేషన్ ద్వా రా వీళ్లను అదుపులోకి తీసుకున్నా రు. శనివారం తెల్లవారుజామున పోలీసులు నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు క్రైం బ్రాంచ్ డీసీపీ అజిత్ రాజియాన్ తెలిపారు.చాలా వరకు బంగ్లాదేశ్కు చెందిన శరణా ర్థుల్ని పట్టుకున్నామని, దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్ల డించారు.
ఒకవేళ సరైన డాక్యుమెంట్లు లేకపో తే వాళ్లను డిపోర్ట్ చేయనున్నట్లు తెలిపారు. అహ్మదాబాద్ క్రైం బ్రాం చ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూపు, ఎక నామిక్ అఫెన్స్ వింగ్, ఆరో జోన్తో పాటు హెడ్క్వార్టర్స్కు చెందిన పో లీసులు ఈ కూంబింగ్ ఆపరేషన్లో పాల్గొన్నారు. కాంకరియా ఫుట్బా ల్ గ్రౌండ్లో ఆ అక్రమ వలసదా రుల్ని బంధించినట్లు తెలిపారు.
సూరత్లో కూడా శుక్రవారం రాత్రి కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఎ స్ఓజీ, డీసీబీ, ఏహెచ్టీయూ, పీ సీబీ సిబ్బంది ఆపరేషన్ నిర్వహిం చింది. దాదాపు వంద మందికిపైగా బంగ్లాదేశీలను అరెస్టు చేశారు. అక్ర మంగా ఇండియాలోకి ప్రవేశించిన బంగ్లాదేశీలు ఫేక్ డాక్యుమెంట్లతో సూరత్లో నివసిస్తున్నట్లు తెలిసిం ది. విచారణ తర్వాత అందర్నీ బం గ్లాదేశ్కు పంపనున్నట్లు స్పెషల్ ఆ పరేషన్స్ గ్రూపు డీసీపీ రాజ్దీప్ సింగ్ నాకుం తెలిపారు.