Big Breaking News : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశ రాజ ధాని హస్తినలో సంచలన సంఘట న చోటు చేసుకుంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివా సంలో జరిగిన అగ్నిప్రమాదం త ర్వాత భారీ మొత్తంలో నగదు ల భ్యం కావడం కలకలం రేపింది. దీం తో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూ ర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొ లీజియం ఆయనను వేరే హైకో ర్టు కు బదిలీ చేయాలని నిర్ణయించింది.
అగ్ని ప్రమాదం జరిగిన సమ యంలో జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ లో లేరని, అగ్నిప్రమాదం గురించి కుటుంబ సభ్యులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటలు ఆర్పివేసిన తర్వాత, అగ్నిమాపక సిబ్బందికి ఒక గదిలో భారీగా నోట్ల కట్టలు కనిపించాయి.దీనిని అధికారులు ఐటీ లెక్కల్లో చూపించని డబ్బుగా గుర్తించారు. స్థానిక పోలీసులు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయగా వారు ప్రభుత్వా నికి నివేదిక అందజేశారు.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా దీనిపై తీవ్రంగా స్పందించా రు. వెంటనే కొలీజియం సమావేశం ఏర్పాటు చేశారు. జస్టిస్ వర్మను వెంటనే బదిలీ చేయాలని కొలీజి యం ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఆయన 2021 అక్టో బర్లో అలహాబాద్ నుoచే ఢిల్లీ హై కోర్టుకు వచ్చారు.