Building Collapses : ప్రజా దీవెన న్యూ ఢిల్లీ: దేశ రాజ ధాని ఢిల్లీలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. తూర్పు ఢిల్లీలోని ము స్తఫాబాద్ ప్రాంతంలో ఆరు అంత స్తుల భవనం కుప్పకూలిన ఘటన లో ఇప్పటి వరకు నలుగురు మృ త్యువాతపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లుగా అనుమానిస్తున్నారు.
ఢిల్లీ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రా రంభించాయి. కూలిపోయిన భవ నంలో నిర్మాణ పనులు జరుగుతు న్నాయని ప్రాథమిక సమాచారం. గురువారం రాత్రి సమయంలో ఈ ఘటన జరిగిందని అదనపు పోలీ స్ కమిషనర్ వినీత్ కుమార్ పేర్కొ న్నారు. సంఘటనా స్థలానికి చేరు కునే సరికి భవనం కూలిపోయి భా రీగా దుమ్మురేగిందని పేర్కొన్నారు.
నలుగురు చనిపోయారని ఇద్దరు గాయపడ్డట్లు తెలిపారు. మధు వి హార్ పోలీస్ స్టేషన్ సమీపంలో ని ర్మాణంలో ఉన్న భవనం కూలిపో యి ఒకరు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. డివిజనల్ ఫైర్ ఆఫీ సర్ రాజేంద్ర అత్వాల్ మాట్లాడు తూ తెల్లవారుజామున 2.50 గం టల ప్రాంతంలో ఇల్లు కూలిపోయి నట్లు సమాచారం అందిందని పే ర్కొన్నారు.
సంఘటనా స్థలానికి చేరుకుని మొ త్తం భవనం కూలిపోయిందన్నా రు. ఎన్డీఆర్ఎఫ్, ఢిల్లీ ఫైర్ సర్వీ సెస్ బృందాలు కలిసి సహాయక చ ర్యలు చేపడుతున్నాయి. ఓ ప్రత్య క్ష సాక్షి మాట్లాడుతూ కూలిపోయి న ఆరు అంతస్తుల భవనంలో ఇద్ద రు వ్యక్తులు ఇద్దరు మహిళలు ఉ న్నట్లుగా ప్రత్యక్ష సాక్షి తెలిపింది. ఓ మహిళకు ముగ్గురు పిల్లలు, మరో మహిళకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారని ప్రస్తుతం వారు ఎక్కడా కనిపించడం లేదని చెప్పింది.