Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CBI: సిబిఐ అదుపులో మరో ఇద్దరు

–నీట్ కేసులో పాట్నా లో ఇద్దరు అరెస్టు
–ఈ కేసులో మొత్తం 11కు చేరిన అరెస్టులు
–పట్నా, గోధ్రా సెంటర్లలో 183 మం దికి 640 కన్నా ఎక్కువ మార్కులు

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశ వ్యాప్త సంచలనాలకు దారి తీసిన నీట్‌ (neet) అక్ర మాలపై సీబీఐ (cbi) దవ్యాపు ముమ్మ రంగా కొనసాగుతోంది. పట్నాలో తాజాగా మరో ఇద్దరిని అరెస్టు చేసిం ది. నలందకు చెందిన సన్నీ అనే అభ్యర్థిని, రంజిత్‌ కుమార్‌ అనే మరో అభ్యర్థి తండ్రిని అదుపులోకి తీసుకుంది. దీంతో ఈ కేసులో సీబీఐ ఇప్పటిదాకా చేసిన అరెస్టుల సంఖ్య 11కు పెరిగింది. ఈ పదకొం డు మందిలో నీట్‌ పరీక్ష రాసిన అ భ్యర్థి తాజాగా అరెస్ట్‌ (arrest)అయిన సన్నీ ఒక్కడే. మిగతా 10 మందీ పేపర్‌ లీకేజీకి పాల్పడటం, నిందితులకు ఆశ్రయం ఇవ్వడం వంటి వేర్వేరు ఆరోపణలపై అరెస్టయినవారు. అలాగే, ఇప్పటిదాకా అరెస్టయిన వారిలో ఎనిమిది మంది బిహార్‌కు చెందినవారు కాగా ఇద్దరు గుజరా తీలు, మరొకరు డెహ్రాడూన్‌ కు చెందిన వ్యక్తి. కాగా నీట్‌ పేపర్‌ లీకేజీకి సంబంధించి కేసులు నమోదైన పట్నాలోని 12 పరీక్షా కేంద్రాల్లో 175 మంది, గోధ్రాలోని 2 సెంటర్లలో 8 మంది (మొత్తం కలిపి 183 మంది) మాత్రమే 640 అంత కన్నా ఎక్కువ స్కోర్‌ చేసినట్టు జాతీ య టెస్టింగ్‌ ఏజెన్సీ వెల్లడించింది.

పట్నాలో (patna)రాసినవారిలో 35 మంది మాత్రమే 680 అంతకన్నా ఎక్కు వగా మార్కులు సాధించగా గోధ్రా లోని ఎగ్జామ్‌ సెంటర్లలో పరీక్ష రాసి న ఏ అభ్యర్థీ ఆ మార్కులు సాధిం చలేకపోయారని వివరించింది. ‘నీట్‌ పేపర్‌ లీకేజీ సుస్పష్టం. అయితే, అది ఏ స్థాయిలో జరిగిందో తేలాల్సి ఉంది. పెద్ద ఎత్తున జరిగి ఉంటే మళ్లీ పరీక్షకు ఆదేశించక తప్పదు’ అంటూ సుప్రీంకోర్టు సోమవారం వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఎన్‌ టీఏ అధికారులు ఈ వివరాలను వెల్లడించారు. పదివేలలోపు ర్యాం కులు సాధించినవారంతా ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదని.. దేశంలోని 800 సెంటర్లలోనూ ర్యాంకర్లు విస్తరించి ఉన్నారని తెలిపారు. ఎంబీబీఎస్‌లో లేదా దంత వైద్య కళాశాలల్లో సీట్లు సాధించే ర్యాంకు సాధించిన లక్ష మందీ దేశంలోని 4,500 సెంటర్ల పరిధిలో (మొత్తం పరీక్షా కేంద్రాల సంఖ్య 4,750) విస్తరించి ఉన్నారని తెలపడం ద్వారా లీకేజీ పెద్ద ఎత్తున జరగలేదని విషయాన్ని స్పష్టం చేశా రు.

కాగా, నీట్‌ను (neet)రద్దు డిమాండ్ల నేపథ్యంలో మాజీ ఐఏఎస్‌ అధికా రులు ఆర్‌.సుబ్రమణ్యన్‌, సుతీర్థ భట్టాచార్య, జోధ్‌పూర్‌ ఐఐటీ మాజీ డైరెక్టర్‌ ప్రేమ్‌ కల్రా స్పందిం చారు. నీట్‌కు ప్రత్యామ్నాయాన్ని సూచిస్తూ విద్యార్థుల (studnets) ప్రతిభను కేవలం 3 గంటల్లో హడావుడిగా అంచనా వేయడానికి బదులు 11, 12 తరగతుల్లో తరచుగా అంచనా వేయాలన్నారు. అలాగే ఏడాదికి ఆరు వారాల చొప్పున రెండుసార్లు ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎస్‌ వంటివా టిలో ఇంటర్న్‌షిప్‌కు అవకాశమిచ్చి అక్కడ వారి సామాజిక, వ్యావహారి క స్వభావాలను అంచనా వేయాల న్నది రెండో సూచన. ఈ రెండింటికీ 40 శాతం చొప్పున వెయిటేజీ ఇచ్చి ప్రవేశపరీక్షల్లో వచ్చే మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇవ్వాలని (40:40:20 నిష్పత్తి) తమ ప్రతిపాదనలో వివరించారు.