Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chaardham temple yatraa IRCTC : ‘చార్‌ ‘ ధామ్‌ యాత్ర ఎలా వెళ్ళాలో తెలుసా

--దేశంలోనే ప్రముఖ చార్‌ధామ్‌ యాత్రకు రంగం సిద్ధం --యాత్రకు వెళ్లాలనుకునే వారికి ఐఆర్‌ సీటీసీ స్పెషల్‌ ప్యాకేజీ  --ఈ నెల 15న, జూన్‌ 1న, 15న, సెప్టెంబర్‌ 1, 15న, అక్టోబర్‌ 1, 15 తేదీల్లో పర్యాటకులకు అవకాశం

‘చార్‌ ‘ ధామ్‌ యాత్ర ఎలా వెళ్ళాలో తెలుసా

–దేశంలోనే ప్రముఖ చార్‌ధామ్‌ యాత్రకు రంగం సిద్ధం
–యాత్రకు వెళ్లాలనుకునే వారికి ఐఆర్‌ సీటీసీ స్పెషల్‌ ప్యాకేజీ 
–ఈ నెల 15న, జూన్‌ 1న, 15న, సెప్టెంబర్‌ 1, 15న, అక్టోబర్‌ 1, 15 తేదీల్లో పర్యాటకులకు అవకాశం

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశంలోనే ప్రముఖ చార్‌ధామ్‌ యాత్ర ప్రారం భమైంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉండ గా ఈ నెల 10న అక్షయ తృతీయ రోజున యమునోత్రి, గంగోతి, కేదార్‌నాథ్‌ ఆలయాలు తెరుచుకోగా తాజాగా ఆదివారం బద్రీనాథ్‌ ( badrinadh) ఆలయ ద్వారాలు తెరిచారు. ఈ క్రమంలో పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ ( IRCTC) శుభవార్త అందించింది.

చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లాలనుకునే వారి కోసం స్పెషల్‌ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉత్తరాఖండ్‌లోని ( uttarakhan d) ఆలయాలను దర్శించుకునేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటా రు. జీవితకాలంలో ఒక్కసారైనా చార్‌ధామ్‌ యాత్ర లో పాల్గొనాలన్న కుతూహలం ప్రతి ఒక్కరిలో ఉంటుంది.

అక్కడికి వెళ్లేందుకు కొంత ఖర్చు తో కూడుకున్న వ్యవహారం కావడం తో తక్కువ మంది ఆసక్తి కనబరుస్తుoటారు. అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ ప్యాకేజీని ( packege) తాజాగా ప్రకటించింది. ఐఆర్‌ సీటీసీ ఒక్కోసా రి 20 మందితో ప్రత్యేకంగా గ్రూప్‌గా చేసి ఈ నెల 15న, జూన్‌ 1న, 15న, సెప్టెంబర్‌ 1, 15న, అక్టోబర్‌ 1, 15 తేదీల్లో పర్యాటకు లను చార్‌ధామ్‌ యాత్రకు తీసుకెళ్లనున్నది.అయితే, ప్యాకేజీ ఢిల్లీ నుంచి కొనసాగనుండగా బస్‌లో సాగుతుంది. టూర్‌ ప్యాకేజీ లో భా గంగా 12 రోజుల పాటుయాత్రకు సంబంధించి ప్రయాణం కొనసాగుతుంది.

ఐఆర్‌సీటీసీ చార్‌ధామ్‌ యాత్ర వివరాలు ఇలా ఉన్నాయి…
ఐఆర్‌సీటీసీ చార్‌ధామ్‌ యాత్ర ఢిల్లీలోని రైలు నివాస్ బిల్డింగ్ నుం చి ప్రారంభం అవుతుంది. ఢిల్లీ (Delhi)  నుంచి హరిద్వార్‌కు బయ లుదేరి వెళ్లిన తర్వాత ప్రయాణికులు తమ సొంత డబ్బులతో దారి లో భోజనం చేయాల్సి ఉంటుంది. అయితే హరి ద్వార్ చేరుకున్న తర్వాత విందు, రాత్రి బస ఏర్పాట్లు ఐఆర్‌సీటీసీ చూసుకుంటుంది.

రెండోరోజు ఉద యం ప్రయాణికులు అల్పాహారం తర్వాత బస్‌ హరిద్వార్‌ నుంచి బార్కోట్‌కి బయలుదేరుతుంది. ప్రయాణికులు అక్కడే బస చేయా ల్సి ఉంటుంది. మూడోరోజు ఉద యం జానకి ఛత్‌లో యమునోత్రికి వెళ్తారు. జానకీ ఛత్ చేరుకున్న తర్వాత ప్రయాణికులు యమునా దేవి ఆలయ సందర్శనకు వెళ్తారు.

దర్శనాల అనంతరం తిరిగి బార్కో ట్‌కి వస్తారు. నాలుగో రోజు ఉద యం ఉత్తరకాశీకి బయలుదేరి వెళ్తారు. మార్గమధ్యలో ప్రతిపేశ్వర్ మహాకల్, కాశీ విశ్వనాథుడిని సందర్శించి అనంతరం ఉత్తరకాశీకి చేరుకుంటారు. రాత్రి ఉత్తరకాశి లోనే బస చేయాల్సి ఉంటుంది. ఐదో రోజు ఉదయం 5 గంటలకు ఉత్తరకాశీ నుంచి భాగీరథి నదిని పూజిస్తూ భక్తులు గంగోత్రి ఆలయా నికి చేరుకుంటారు.

అక్కడ గంగా దేవి ఆలయాన్ని దర్శిస్తారు. తిరిగి మళ్లీ ఉత్తరకాశీకి పయణమవు తారు. ఆరో రోజు గుప్తకాశీకి బయలుదేరుతారు. అక్క డికి వెళ్లిన తర్వా త విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి కూడా బస ఇక్క డే ఉంటుంది. ఏడో రోజు ఉదయం 4 గంటలకు సోన్‌ ప్రయాగకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి సొంత ఖర్చులతో కేదార్‌నాథ్‌కు పల్లకీని బుక్‌చేసుకొని గౌరీకుండ్‌కు చేరుకోవాల్సి ఉంటుంది.

కేదార్‌నాథ్‌ను దర్శించిన అనంతరం అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. 8వ రోజు కేదార్‌నాథ్‌ ఆల యంలో పూజలు చేసుకొని అదే ప్రాంగ ణంలో విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత గౌరీకుండ్‌కు పాదయాత్రగా బయలుదేరాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మళ్లీ సోన్‌ప్రయాగకు మీదు గా గుప్తకాశీకి చేరుతారు. తొమ్మిదో రోజు బద్రీనాథ్ వెళతారు.

బద్రీనాథ్ చేరుకున్న అనంతరం జోషిమఠ్‌లో కొలువుదీరిన నారసిం హస్వామిని దర్శనం చేసుకొని రాత్రి అక్కడే బస చేయాల్సి ఉంటుం ది. ఇక పదో రోజు బద్రినారాయణుడి దర్శనం చేసుకొని రుద్రప్రయాగ కు వెళ్తారు. 11న రుద్రప్రయాగ నుంచి హరి ద్వార్‌కు వెళ్తారు. అక్క డ మానసా దేవిని దర్శించుకొని సాయంత్రం గంగా హారతి చూసి అక్కడ విశ్రాం తి తీసుకోవాల్సి ఉంటుంది.12వ రోజు హరిద్వార్‌ నుంచి ఢిల్లీకి చేరు కోవడంతో పర్యటన ముగుస్తుంది.

ప్యాకేజీ ధరల వివరాలు ఇలా ఉన్నాయి.. ఐఆర్‌సీటీసీ రోడ్‌ ప్యాకే జీలో సింగిల్‌ షేరింగ్‌కు రూ.91,550గా నిర్ణయించింది. డబుల్‌ షేరింగ్‌కు రూ.57వేలు, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.54,490గా నిర్ణయిం చింది. పిల్లలకు సైతం వేర్వేరు ఛార్జీలు చెల్లించాల్సి ఉం టుంది. 5-1 సంవత్సరాల మధ్య పిల్లలకు రూ.30,910 (విత్‌బెడ్‌),రూ.20,480 (విత్‌ అవుట్‌బెడ్‌)గా నిర్ణయించారు. ప్యాకేజీలోనే భక్తులు బస చే సేందుకు హోటల్‌ సౌకర్యం ఉంటుంది. అల్పాహారం, రాత్రి భోజన సదుపాయాలు ఉంటుంది. జీఎస్టీతో కలిసి అన్ని పన్నులను ప్యాకేజీలో చేర్చారు.

ప్రయాణికులకు ప్రతిరోజూ లీటర్‌ వాటర్‌ బాటిల్‌ అందిస్తారు. ప్యాకే జీలో బీమా సౌకర్యం సైతం కవర్‌ అవుతుంది. సొంత ఖర్చులతోనే ప్రయాణికులు ఢిల్లీకి వెళ్లాల్సి ఉం టుంది. కేదార్‌నాథ్‌కు హెలీకాప్ట ర్‌కు, గైడ్‌ ఛార్జీలు, టెలిఫోన్‌, డ్రింక్స్‌, రాఫ్టింగ్‌తో పాటు వ్యక్తిగత ఖర్చులను పర్యాటకులే భరించాల్సి ఉంటుంది.

ప్యాకేజీలో కాకుండా ఇతర ఆహారాలు, డ్రింక్స్‌ కావాలను కుంటే మీరే భరించుకోవాల్సి ఉంటుంది.ఏదైనా కారణాలతో టికెట్‌ రద్దు చేసు కుంటే పాలసీ మేరకు రీఫండ్‌ చేయనున్నారు. పర్యటన ప్రారంభానికి గంట మందు పికప్‌ పా యింట్‌ చేరుకోవాల్సి ఉంటుంది. ఏదైనా వస్తువు విచ్ఛిన్నమైతే క్లెయి మ్ చేసుకునేందుకు అవకాశం ఉంది.

chaardham temple yatraa irctc