CM Yogi Adityanath : ప్రజా దీవెన, ఉత్తర్ ప్రదేశ్: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. బాగ్పత్ లో ఆదినా థుడి ఆలయంలో లడ్డూ వేడుక నిర్వహిస్తుండగా చెక్కతో నిర్మిం చిన వేదిక ఒక్కసారిగా కుప్ప కూలి పోయింది ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్య లో గాయపడ్డారు.పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం బరౌత్లోని జైన్ కమ్మూనిటీ మంగళవారం ‘లడ్డూ మహోత్సవ్’ ను నిర్వ హిం చింది. ఈ కార్యక్ర మంలో పాల్గొ నేందుకు ఉత్తరప్రదేశ్తో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి పెద్ద సం ఖ్యలో భక్తులు ఆదినాథుడి ఆల యానికి చేరుకున్నారు. ఈ సం దర్భంగా భక్తుల కోసం నిర్వాహకు లు చెక్క తో వేదికను నిర్మించారు. అధిక సంఖ్యలో ప్రజలు తరలిరా వడంతో బరువు ఎక్కువై వేదిక ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది.
ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఏడు గురు ప్రాణాలు కోల్పోయారు. సు మారు 50 మంది గాయపడ్డారు. ఘట న సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరు కొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగా త్రులను సమీపంలోని ఆసు పత్రులకు తరలించారు. స్వల్ప గాయాలైన వారికి ప్రథమ చికిత్స అనంతరం ఇంటికి పంపించారు. తీవ్ర గాయాలతో పలువురు చికిత్స పొందుతున్నట్లు బాగ్పత్ పోలీస్ చీఫ్ అర్పిత్ విజయవర్గియా తె లిపారు. మరోవైపు ఈ ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పం దిం చారు. ప్రమాదం గురించి అధికా రులను ఆరా తీశారు. బాధితు లకు మెరుగైన వైద్యం అందించా లని ఆదేశించారు.