Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Delhi Flood Water: వరద నీటిలో మునిగి ముగ్గురు మృతి

— డిల్లీ లో భారీ వర్షాలకు సివిల్స్ పరీక్షల కోసం శిక్షణ పొందుతున్న విద్యార్ధులు బలి
–ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెం ట్‌లోకి అకస్మాత్తుగా వరద నీరు రావడంతో ఘటన
–మృతుల్లో ఇద్దరు అమ్మాయిలు, ఒకరు అబ్బాయి
–ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం మెజిస్టీరి యల్‌ విచారణకు ఆదేశo

Delhi Flood Water: ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశ రాజ ధాని ఢిల్లీలోని (Delhi Flood Water) కొన్ని ప్రాంతాల్లో శని వారం సాయంత్రం భారీ వర్షం కుర వడంతో రహదారులన్నీ జల దిగ్బం (Flood Water))ధమయ్యాయి. ఢిల్లీలోని ఓల్డ్ రా జేంద్ర నగర్‌లో ఐఏఎస్ కోచింగ్ సెం టర్ బేస్‌మెంట్‌లోకి అకస్మా త్తుగా వరద నీరు రావడంతో సివిల్స్ పరీ క్షల కోసం శిక్షణ పొందుతున్న ము గ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. వీరిలో ఇద్దరు అమ్మా యిలు కాగా ఒక అబ్బాయి ఉన్నారు. మృతి చెందిన ముగ్గురు విద్యార్థులను శ్రేయ, తాన్య, నెవి న్‌లుగా గుర్తించారు.కాగా ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై ఢిల్లీ (dlehi)లో నిరసన కొనసాగుతూనే ఉంది. ఘటన తర్వాత ప్రభుత్వం స్పంది స్తున్న తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ముని సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ అధికారులకు వ్యతిరేకంగా విద్యా ర్థులు ఆందోళన చేస్తున్నారు.

విచారణకు ఆదేశించిన డిల్లీ ప్రభుత్వం… ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం మెజిస్టీరియల్‌ (Delhi Govt Magisterial విచా రణకు ఆదేశించింది. 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరింది. మరోవైపు ఈ ఘటనపై విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహం (Indignation) వ్యక్తమవుతోంది.మంత్రి అతిషి మెజిస్టీరియల్ విచారణకు ఆదేశిం చడంపై నిరసనలో పాల్గొన్న ఓ విద్యార్థి మాట్లాడుతూ ఈ సంఘ టనకు ఎవరూ బాధ్యత వహించ రన్నారు. ప్రభుత్వం నుండి ఎవరైనా ఇక్కడికి వచ్చి ప్రాణాలు కోల్పోయి న విద్యార్థులందరికీ బాధ్యత వహించాలని తాము కోరుకుంటు న్నట్లు తెలిపారు. ఏసీ గదుల్లోంచి ట్వీట్లు చేయడం లేదా లేఖలు రాయడం ద్వారా ఎలాంటి ఉపయో గం ఉండదన్నారు. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (Municipal Corporation of Delhi)అధికారులకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళ నలు చేస్తున్నారు. ఢిల్లీలో కోచింగ్ సెంటర్లకు సంబంధించిన గ్రంథాల యాలు 80 శాతం గ్రంథాలయాలు బేస్‌మెంట్‌లోనే ఉంటాయని.. వర్షం కురిసిన 10 నిమిషాలకే ఈ ప్రదేశం నీటితో నిండిపోతుందని, దీనిపై ఎంసీడీ అధికారులు ఎలాంటి చర్య లు తీసుకోలేదని విద్యార్థులు వాపోతున్నారు.

ఆప్ బాధ్యత వహించాలి..
ఢిల్లీలో కోచింగ్ సెంటర్‌లో వరద నీరు చేరి విద్యార్థులు మృతి చెందిన ఘటనకు ఆప్ ప్రభుత్వం బాధ్యత వహించాలని బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ (Bansuri Swaraj) డిమాండ్ చేశా రు. తమ భవిష్యత్తు కలలను సాకా రం చేసుకునేందుకు విద్యార్థులు ఇక్కడికి వచ్చారన్నారు. ఢిల్లీ ప్రభు త్వం మాత్రం విద్యార్థుల సంరక్ష ణను గాలికొదిలేసి నిబంధనలకు విరుద్దుంగా నిర్మాణాలకు అనుమ తులు ఇచ్చిందన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలోని డ్రెయిన్‌ను శుభ్రం చేయాలని ఎమ్మెల్యే దుర్గేష్‌ పాఠక్‌కు ఎన్నోసార్లు విన్నవించినా ఉపయోగంలేదని స్థానికులు చెబు తున్నారని ఎంపీ తెలిపారు. డ్రెయి న్ మొత్తం బురద నీతితో నిండి పోవడంతోనే వర్షం కురిసిన వెంటనే ఆ ప్రాంతం పూర్తిగా నీటితో నిండిపో తుందన్నారు. విద్యార్థుల మరణాల కు కేజ్రీవాల్ (Kejriwal) ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.