Farmers loan waiver: ‘ఇండియా’ అధికారం చేపట్టగానే రైతుల రుణమాఫీ
ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ చేస్తా మని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హామీ ఇచ్చారు. సోమవారం పంజాబ్ రాష్ట్రం ఫరీద్ కోట్ లోక్ సభ పరిధిలోని కోటక్ పుర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం కు బిజెపి తగిన మూల్యం చెల్లించు కుంటుంది
బిలియన్లకు మోడీ రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్ట్ లు కేటాయించి దేశ పరువు తీశారు
చైనా దురాక్రమణ పై మోడీ మౌనం దేనికి సంకేతం
మోడీ ప్రధాన మంత్రి పదవి స్థాయిని దిగజార్చారు
పంజాబ్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
ప్రజా దీవెన, పంజాబ్: ఇండియా కూటమి(India Alliance) అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ చేస్తా మని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు(Deputy CM Bhatti vikramarka mallu) హామీ ఇచ్చారు. సోమవారం పంజాబ్ రాష్ట్రం ఫరీద్ కోట్ లోక్ సభ పరిధిలోని కోటక్ పుర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఒక కమిషన్ ఏర్పాటు చేస్తుంది రైతులకు రుణమాఫీ అవసరమైన ప్రతిసారి ఆ కమిటీ ప్రభుత్వానికి తెలియజేస్తుంది మేము కమిటీ సిఫారసులను అమలు చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే అగ్ని వీర్ స్కీంను రద్దు చేస్తుందని తెలిపారు.
మోడీ భారత సైనికులను కార్మికులుగా మార్చి రెండు రకాల అమరవీరులను సృష్టించారని విమర్శించారు. అమరవీరుల హోదా, పెన్షన్ తో పాటు అన్ని సౌకర్యాలు పొందే వారు ఒకరైతే, పేద కుటుంబాల యువతకు మాత్రం ఇలాంటి గౌరవాలు, సౌకర్యాలు లేకుండా వివాదాస్పద పథకాన్ని అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అగ్ని వీర్ పథకం సైన్యం ఆలోచన కాదని ఇది మోడీ కుట్రపూరిత పథకమని విమర్శించారు. ప్రభుత్వాన్ని బిలియనీర్ లు అయిన అదాని, అంబానీలు నడుపుతున్నారు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు(Railway Stations)ప్రధాని అదాని గ్రూపులకు విక్రయించి మోడీ తన పరువు పోగొట్టుకున్నారని, ఈ దేశం పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగం,(Unemployment) ద్రవ్యోల్బణం(inflation), అవినీతి (corruption) పరిస్థితులకు బిజెపి తగిన మూల్యం చెల్లించుకుంటుందని డిప్యూటీ సీఎం అన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది, యువతకు తీరని నష్టం వాటిల్లుతోంది, బిజెపి పాలనలో ద్రవ్యోల్బణం, అవినీతి, అస్థిరతతో ప్రజలు విసిగిపోయారు ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు ఒక పెద్ద మార్పు తీసుకురాబోతున్నారని తెలిపారు. ఇండియా కూటమికి వస్తున్న ఆదరణ చూసి మోడీ తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆ క్రమంలో విపక్షాలపై దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
ఎన్నికలవేళ గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనులు చెప్పుకోవాల్సిన ప్రధాని మోడీ మతం, మంగళసూత్రం, ముజ్రా వంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం, ఆయన ప్రధాని పదవి గౌరవాన్ని తగ్గిస్తున్నారని అన్నారు. పాకిస్తాన్ తో పోరాడి బంగ్లాదేశ్ కు స్వతంత్రం తెచ్చిపె ట్టాం. చైనా మన భూమిని ఆక్రమించి ఇల్లు, రోడ్లు నిర్మిస్తున్న ప్రధాని మోడీ మౌనంగా ఉండడం దేనికి సూచిక అని ప్రశ్నించారు.
Farmers loan waiver ‘India’ took power