Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Fire Accidents: వరుస అగ్ని ప్రమాదాలతో వణుకు

–నేటి డిల్లీ అగ్ని ప్రమాదoలో నలుగురు దుర్మరణం
–పొగతో ఊపిరాడక నిద్రలోనే మృత్యు ఒడిలోకి నలుగురు కుటుంబ సభ్యులు

Fire Accidents: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో (delhi) వరుసగా అగ్నిప్రమాదా లు చోటు చేసుకుంటూ ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాయి. మంగళవా రం తెల్లవారుజామున తాజాగా ప్రేమ్ నగర్ (Prem Nagar) లోని ఓ ఇంటిలో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఆ ఇంటిలోని ఇన్వర్టర్ లో (inverter) మంటలు చెలరేగడంతో ఇల్లం తా పొగ కమ్మేసి ఆ మంటలు కాస్తా క్రమంగా సోఫాకు వ్యాపించి పొగ మరింత ఎక్కువై పై అంతస్తులోకి పాకడంతో గాఢ నిద్రలో ఉన్న నలు గురు కుటుంబ సభ్యులు ఊపిరా డక మృచ్చోడిలోకి జారుకున్నారు. భర్త, భార్య, ఇద్దరు కుమారు లు మరణించనట్లు స్థానికులు తెలి పారు. ఇదిలా ఉండగా నెలరోజుల వ్యవధిలోనే ఢిల్లీ లో 5 అగ్నిప్రమాదాలు (fire accidents)చోటు చేసుకోవడం గమ నార్హం. గత నెల 26న వివేక్ విహార్ ప్రాంతంలోని న్యూ బోర్న్ బేబీ కేర్ (New Born Baby Care)ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోగా ఏడుగురు నవ జాత శిశువులు మరణించారు. జూన్ 6న మరో ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరగ్గా 50 మంది తృ టిలో తప్పించుకున్నారు. జూన్ 9న నరేలా ప్రాంతంలోని ఒక ఆహార శుద్ధి పరిశ్రమలో జరిగిన అగ్నిప్ర మాదంలో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. వారంరోజుల క్రితం తూర్పు ఢిల్లీలోని గాంధీనగర్ ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలోనూ అగ్నిప్రమాదం జరిగింది. ఇలా ఢిల్లీలో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని గజగజలాడుతున్నారు.