Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

INDIA Alliance: సరైన సమయం కోసం సయమనం పాటిస్తాం

దేశాన్ని బీజేపీ ప్రభుత్వం పరిపాలించొద్దని దేశ ప్రజానీకం కోరుకున్నారని, వారి ఆకాంక్షను నెరవేర్చటానికి సరైన సమయంలో సరైన చర్యల కోసం సంయమనo పాటిస్తామని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొ న్నారు

బీజేపీ వద్దంటూ దేశ ప్రజలిచ్చిన తీర్పు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రయత్నిస్తాం
మోదీ, బీజేపీ ఫాసిస్టు పాలనపై పోరాటాన్ని కొనసాగిస్తాం
భావసారూప్య పార్టీలను ఇప్ప టికీ ఆహ్వానిస్తున్నాం
భేటీ అనంతరం మీడియా సమావే శంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికా ర్జున ఖర్గే

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశాన్ని బీజేపీ ప్రభుత్వం పరిపాలించొద్దని దేశ ప్రజానీకం కోరుకున్నారని, వారి ఆకాంక్షను నెరవేర్చటానికి సరైన సమయంలో సరైన చర్యల కోసం సంయమనo పాటిస్తామని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొ న్నారు. తద్వారా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపై వేచి చూసే ధోరణి అవలంబించనున్నట్లు చెప్ప కనే చెప్పారు. ఎన్నికల్లో దేశప్రజలు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా స్పష్ట మైన తీర్పు ఇచ్చారని, బీజేపీకి మెజారిటీ (BJP majority)ఇవ్వలేదని గుర్తు చేశా రు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రతిపక్ష ఇండియా(India alliance) కూట మి నేతలు బుధవారం ఖర్గే నివా సంలో సమావేశమయ్యారు. రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీ అనంతరం ఖర్గే మీడియాతో మాట్లా డారు.

తమ కూటమికి ప్రజలు మద్ద తు పలికారని, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును బీజేపీకి, ఆ పార్టీ అనుసరించే విద్వేష, వివక్షాపూరి త, అవినీతి రాజకీయాల కువ్య తిరేకంగా ధీటైన జవాబుగా అభి వర్ణించారు.రాజ్యాంగానికి మద్ద తుగా ప్రజలు ఇచ్చిన తీర్పని ధరల పెరుగుదలకు, నిరుద్యోగానికి, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరి రక్షణ కోసం ఈ తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలో కొనసాగే బీజేపీ ఫాసిస్టు(modi fascist ) పాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిం చాలని కూటమి నిర్ణయించిందన్నా రు. ఈ మేరకు కూటమి ఏకగ్రీవ తీ ర్మానాన్ని ఆమోదించిందని పేర్కొం టూ తీర్మానాన్ని ఖర్గే చదివి విని పిం చారు. అంతకుముందు ఇండియా కూటమి నేతల సమావేశాన్ని ఉద్దే శించి ఖర్గే మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికలలో(Lok sabha elections) మోదీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఐక్యంగా పోరా డిందని, భాగస్వామ్య పక్షాలన్నీ సమర్థవంతంగా పోరాడాయని పేర్కొంటూ కూటమి పార్టీల నేతల కు కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్నిక ల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మోదీకి, ఆయన అనుసరించే రాజకీయాల కు పూర్తి వ్యతిరేకమన్నారు. ఎన్ని కల ఫలితాలు మోదీకి రాజకీయం గా తీవ్ర నష్టదాయకమని, నైతికంగా ఆయనకు ఘోర పరాభవాన్ని మిగి ల్చాయని అభిప్రాయపడ్డారు. అయి నప్పటికీ, ప్రజాతీర్పును తుంగలో తొక్కటానికి మోదీ సిద్ధ మయ్యారని విమర్శించారు. రా జ్యాంగ విలువలకు, ఆర్థిక, సామా జిక, రాజకీయ న్యాయానికి కట్టుబ డి ఉన్న పార్టీలను ఇండియా కూట మి ఆహ్వానిస్తుందని ఖర్గే పిలుపు నిచ్చారు. కాగా ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాలు, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు గల అవకా శాలు, భవిష్యత్‌ వ్యూహంపై కూటమి నేతలు చర్చించారు.

ఎన్డీఏలో కీలకంగా మారిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(TDP president chandrababu naidu), జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ లను() కూటమిలోకి ఆహ్వానించే అవకాశాలపైనా మాట్లాడుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికైతే ప్రతిప క్షంలో కూర్చోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమా వేశంలో ఖర్గేతోపాటు సోనియాగాం ధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌, జార్ఖండ్‌ సీఎం చంపై సోరెన్‌, మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ భార్య కల్ప నా సోరెన్‌, ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌, ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌, ఎన్సీపీ (శరద్‌పవార్‌) పార్టీ నేతలు శరద్‌పవార్‌, సుప్రి యాసూలే, లెఫ్ట్‌ నేతలు సీతారాం ఏచూరి, డీ రాజా, ఆప్‌ తరపున రాఘవ్‌ చద్దా, సంజయ్‌ సింగ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా, తృణమూల్‌ నేత అభిషేక్‌ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.

ఉద్ధవ్‌ ఠాక్రే ఉద్దేశ్యపూర్వంగా గైర్హాజరు… ఇండియా కూటమి(INDIA alliance) సమావేశానికి (Shivasena)శివసేన(యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే గైర్హాజర య్యారు. ఆ పార్టీ ముఖ్య నేతలు సంజయ్‌ రౌత్‌, అనిల్‌ దేశాయ్‌ హాజ రయ్యారు. మంగళవారం లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఉద్ధ వ్‌ స్పందిస్తూ బీజేపీకి మెజారిటీ దక్కనందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ఇండియా కూటమిపై ఉందని, ఢిల్లీలో జరిగే సమావేశా నికి తాను తప్పక హాజరవుతానని, అక్కడే ప్రధాని అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తామని ప్రకటించారు. అయి నప్పటికీ బుధవారం నాటి సమావే శానికి ఆయన గైర్హాజరు కావటం అనుమానాలకు తావిస్తోంది. మహా రాష్ట్రలోని సంగ్లీ లోక్‌సభ స్థానంలో తమ పార్టీ అభ్యర్థి ఓడిపోవడానికి కాంగ్రెస్‌ పరోక్షంగా సహకరించిందని ఆరోపణలు ఉన్నాయి. ఆ విషయం లో ఆయన కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం తో ఊగిపోతున్నారని ప్రచారం జరు గుతోంది.

INDIA fight against modi fascist regime