Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

India Parliament: అసలు పార్లమెంట్ అంటే ఏంటి?

భారత పార్లమెంట్.  భారతదేశ అత్యున్నత శాసనమండలి.

భారత పార్లమెంట్

అసలు పార్లమెంట్ అంటే ఏంటి?

ఇందులో ఎవరెవరు ఉంటారు..?

అసలు ఎంపీలు చేసే పనేంటి..?

వారి పదవి కాలం ఎంత..?

ప్రజా దీవెన నల్లగొండ బ్యూరో: భారత పార్లమెంట్(India parliament).  భారతదేశ అత్యున్నత శాసనమండలి. ఇందులో రాష్ట్రపతి, రెండు సభలు ఉన్నాయి. ఒకటి లోక్ సభ , రెండవది రాజ్యసభ. ఇది భారత రాజధాని ఢిల్లీ లోని సంసద్ మార్లో గలదు. భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం ప్రకారం మొదటి సాధారణ ఎన్నికలు 1951-52 సంవత్సరంలో జరిగాయి. మొదటి ఎన్నికైన పార్లమెంటు 1952 ఏప్రిల్లో ఉనికిలోకి వచ్చింది. రాష్ట్రపతి, (President) ఉభయ సభలతో కూడిన ఉభయసభలను రాష్ట్రాల మండలి (రాజ్యసభ), హౌస్ ఆఫ్ పీపుల్ (లోక్ సభ) అని పిలుస్తారు.
అసలు పార్లమెంట్ అంటే ఏంటి? ఇందులో ఎవరెవరు ఉంటారు..? అసలు ఎంపీలు చేసే పనేంటి..? వారి పదవి కాలం ఎంత..? తదితర అంశాలపై లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రజా దీవెన ప్రత్యేక కథనం.

పార్లమెంట్ అంటే తెలుసా..?

లోక్ సభ ఎన్నికల( Lok Sabha elections)నిర్వహణలో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురివారం ముగిసింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు తమ ప్రచారానికి పదును పెడుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహలకు పదును పెడుతున్నారు. అయితే లోక్ సభ, రాజ్యసభను కలిపి పార్లమెంటుగా( parliament) వ్యవహరిస్తారు. ఆయా సభ్యుల ఎన్నిక విధి విధానాలు తదితర అంశాలను గురించి తెలుసుకుందాం.

లోక్ సభ అంటే…

లోక్ సభను ప్రజా ప్రతినిధుల సభ అని కూడా అంటారు. ఇందులో గరిష్టంగా 552 మంది సభ్యులు (ఎంపీలు) ఉంటారు. ప్రస్తుతం 543 మంది సభ్యులు ఉన్నారు. మిగిలిన ఇద్దరూ ఆంగ్లో ఇండియన్ లను రాష్ట్రపతి నియమిస్తారు. వీరి పదవి కాలం ఐదేళ్ల(5years) వరకు ఉంటుంది. అయితే కొన్ని అసాధారణ పరిస్థితుల్లో లోక్ సభ ను రద్దు చేసే అవకాశం ఉంటుంది. సభలోని సభ్యుల నుంచి ఒకరిని సభాపతి (స్పీకర్) గా, మరొకరిని ఉప సభాపతిగా ఎన్నుకుంటారు. సాధారణంగా లోక్ సభ లో సంవత్సరానికి మూడు పర్యాయాలు (శీతాకాల, వర్షాకాలం, బడ్జెట్) సమావేశాల నిర్వహణ ఉంటుంది.

రాజ్యసభ ఇలా…

రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉన్నారు. ఆయా రాష్ట్రాల శాసన సభ్యుల సంఖ్యను బట్టి పరోక్షంగా ఎన్నిక జరుగుతుంది. ఇందులో 12 మందిని వివిధ రంగాల్లో( కలలు, భాష, విజ్ఞానం, సేవరంగాలు ) నిపుణులైన వారిలో అత్యున్నత సేవలు అందించిన వారిని రాష్ట్రపతి(President) ఎంపిక చేస్తారు. రాజ్యసభకు ఉపరాష్ట్రపతి చైర్మన్ గా వ్యవహరిస్తారు. డిప్యూటీ చైర్మన్ గా ఒకరిని ఎన్నుకుంటారు. ఇందులో సభ్యుల పదవి కాలం ఆరేళ్లు ఉంటుంది. చట్టాల రూపకల్పనలో లోక్ సభకు సరిసమానమైన అధికారం రాజ్యసభకు ఉంటుంది.

ఎంపీల విధులు..బాధ్యతలు

సుమారు ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి కలిపి లోక్ సభ నియోజకవర్గంగా ఉంటుంది. ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి భారత పౌరుడై ఉండి ఏదో ఒక నియోజకవర్గంలో ఓటర్ అయి ఉండాలి. గెలిచిన సభ్యుడు తాను ఎంపికైన నియోజకవర్గ సమస్యలు లోక్ సభ సమావేశాల్లో చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేయాలి. చట్టాల రూపకల్పనలో కీలక భూమిక పోషిస్తారు. బ్యాంకింగ్, తపాలా, రైల్వే, విమానయాన, కేంద్రీయ విద్యాలయం, ప్రధాన రహదారులు, తదితర కేంద్ర ప్రభుత్వ రంగ ఆధీనంలోని సంస్థల సమస్యల పరిష్కారానికి, నిధులు రాబడికి కృషి చేస్తారు. ప్రతి సభ్యుడికి కనీసం లక్ష రూపాయల వేతనం ఉంటుంది. (ఇతర అలవెన్స్ లు మినహా ) తమ నియోజకవర్గాల అభివృద్ధికి ఏటా ప్రత్యేక బడ్జెట్ ఉంటుంది. సమస్య తీవ్రతను బట్టి ప్రభుత్వ పెద్దలతో చర్చించి మరిన్ని నిధులు రాబట్టుకునే అవకాశం ఏర్పడుతుంది.

India parliament history in telugu