Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Journalistspension : జర్నలిస్టులకు పెన్షన్ విధానo అమలు

జర్నలిస్టులకు పెన్షన్ విధానo అమలు

— రాష్ట్రాల్లో ఒత్తిడి తీసుకురావా ల్సిన అవసరం ఉంది
–ఛత్తీస్ ఘడ్ లో పెన్షన్ రూ.20 వే లకు పెంపు నిర్ణయం హర్షణీయం
— ఐజేయు అధ్యక్షులు వినోద్ కు మార్ కోహ్లీ

Journalistspension: ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రిటైర్డ్ అయిన జర్న లిస్టులకు పెన్షన్ విధానాన్ని అమలు చేసే దిశగా ఆయా రాష్ట్రాల్లో ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ కార్యవర్గ స మావేశం అభిప్రాయపడింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ విధానం అమ ల్లో ఉండగా తాజాగా ఛత్తీస్ ఘడ్ లో పదివేల రూపాయలు ఉన్న పె న్షన్ ను రూ. 20 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా అ భినందించారు.

ఐజేయు అధ్యక్షు లు వినోద్ కుమార్ కోహ్లీ అధ్యక్షత న జరిగిన ఈ కార్యవర్గ సమావేశం లో అయితే ఫౌండర్ ప్రెసిడెంట్ సు రేష్ అకౌరి, ప్రధాన కార్యదర్శి సభ నాయకన్ లతో పాటు వివిధ రా ష్ట్రాలకు చెందిన జాతీయ కార్యవర్గం పాల్గొంది.

ఈ సందర్భంగా పెన్ష న్ విధానం విషయంలో ఆయా రా ష్ట్రాల్లో సం ఘాలు అక్కడి ప్రభు త్వాలపై ఒత్తిడి తెచ్చి సాధించే దిశగా ప్రయ త్నించాలని తీర్మానిం చారు. దీంతోపాటు చండీగర్ లాం టి రాష్ట్రాల్లో వెబ్ మీడియాను అ ధికారికంగా గుర్తించి గుర్తింపు కార్డులు అక్కడ ప్రభుత్వం జారీ చే సిందని, కొన్ని నియమ నిబంధనల ఆధారంగా న్యూ మీడియాను కూడా ప్రభుత్వం గుర్తిస్తున్న నేపథ్యంలో ఈ విష యమై జాతీయ స్థాయిలో అభిప్రాయ సేకరణ జరిపి ఏ విధంగా ముందుకెళ్లాలని దిశగా కార్యవర్గం సమావేశం తీర్మానించింది.

ప్రస్తుత రైల్వే శాఖ మంత్రి కి రైల్వే పాసుల పునరుద్ధరణ విషయమై ఇప్పటికే ఐజేయు లేఖ రాసిందని, దానికి ప్రత్యుత్తరంగా వారు సీని యర్ సిటిజన్స్ తో పాటు అందరి సబ్సిడీలను ఎత్తి వేసినట్టు తెలిపా రని, రైల్వే రైల్వే శాఖ నష్టా ల్లో నేపథ్యంలో ఇప్పుడు సబ్సిడీ సాధ్యం కాదని వెల్లడించిన నేప థ్యంలో భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ దిశగా ముందుకు సాగాలని తీర్మానించారు.

వీటితో పాటు అనేక విషయాలు చర్చించిన ఈ సమావేశం ఢిల్లీలోని బెంగాల్ భవన్లో సోమవారం జరిగింది. కార్య క్రమంలో తెలంగాణ రాష్ట్రం నుండి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి ఆస్కాని మా రుతి సాగర్, జాతీ య కార్యవర్గ సభ్యులు ఆ వ్వారి భాస్కర్, రాష్ట్ర నాయకులు తిరు పతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.