Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kejriwal : అన్నా హజారే సంచలన వ్యాఖ్య లు, కేజ్రీవాల్ పై ఫుల్ ఫైర్

Kejriwal : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: ఢిల్లీ ఎన్ని కల ఫలితాలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మాజీ శి ష్యుడు అరవింద్ కేజ్రీవాల్ అధికార దాహమే ఆమ్ ఆద్మీ పార్టీని ముం చేసిందని విమర్శించారు. ఆప్ కు ఎదుర్కొంటున్న ప్రస్తుత దారుణ ప రాభవానికి ముమ్మాటికీ కేజ్రీవాల్ వైఖరే కారణమని మండిపడ్డారు. అవినీతి రహిత పాలన అందిస్తాన ని అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్.. అటుపై అధికార దాహంతో చేసిన పనులతో ఢిల్లీ ఓటర్లు తీవ్ర అసం తృప్తి గురయ్యారని పేర్కొన్నారు.

మూడు పర్యాయాలు ఢిల్లీ సీఎం సీటులో కూర్చున్న కేజ్రీవాల్ పై ఢిల్లీలోనే కాదు దేశవ్యాప్తంగా అవి నీతి ఆరోపణలు వచ్చాయని అన్నా హజారే గుర్తుచేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో స్కాం ఆరోపణ లు కేజ్రీవాల్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి మచ్చగా మారాయని చెప్పా రు. అందుకే ఢిల్లీ ఓటర్లు కేజ్రీవాల్ ను ఓడించారని అన్నా హజారే చెప్పుకొచ్చారు. అవినీతికి వ్యతిరే కంగా ఉద్యమించిన అన్నా హజా రేకు మద్దతుగా కేజ్రీవాల్ తన ఉ ద్యోగాన్ని వదులుకుని మరీ వెం టనడిచారు. అన్నా హజారేకు శిష్యుడిగా అవినీతిపై పోరాడారు. ఆ తర్వాత ఉద్యమాన్ని తన చేతు ల్లోకి తీసుకుని దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తొలి ఎన్నికల్లోనే చె ప్పుకోదగ్గ స్థానాలను గెల్చుకుని కాంగ్రెస్ సాయంతో సీఎం సీట్లో కూర్చున్నారు. ఢిల్లీ ముఖ్యమం త్రిగా కేజ్రీవాల్ తీసుకున్న పలు నిర్ణయాలపై రాజకీయంగా విమ ర్శలు వ్యక్తం కావడం, లిక్కర్ స్కాం లో జైలుపాలవడం తదితర కార ణాలు ఆప్ ను ఓడించాయని అన్నా హజారే అభిప్రాయపడ్డారు.