Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Maha Kumbh Mela : మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం, కాలి బూడిదైన టెంట్లు

Maha Kumbh Mela : ప్రజా దీవెన, మహా కుంభమేళా: మహా కుంభమేళాలో ప్రమాదకర సంఘటనలు కొనసాగుతూనే ఉ న్నాయి. మహా కుంభమేళాలో మ రోసారి అగ్నిప్రమాదం సంభవిం చింది. సెక్టార్-18 శంకరాచార్య మార్గంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో అక్కడ ఏర్పాటు చేసిన పలు టెంట్లు కాలిపోయాయి.అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తు న్నారు.

 

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.
కాగా, ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరు గాం చిన ఈ కుంభమేళాలో వరుస ప్ర మాదాలు ఆందోళన కలిగిస్తున్నా యి. మౌని అమావాస్య సందర్భం గా గత నెల 29వ తేదీన కుంభమే ళా ప్రాంతంలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిం దే. ఈ ఘటనలో 30 మంది ప్రాణా లు కోల్పోయారు. సుమారు 60 మంది గాయపడ్డారు. ఇక కుంభ మేళా ప్రారంభమైనప్పటి నుంచి అప్పటి వరకూ అక్కడ అగ్నిప్ర మాదం జరగడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.