Modi Meditation: నలభైఐదు గంటలు నరేంద్రుడి ‘ధ్యాన’ మండపంలో నరేంద్రమోదీ
దేశం లో లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు తుది దశకు చేరుకొని ఎన్నికల తుది దశ ప్రచారం సైతం గురు వారం సాయంత్రంతో ముగిసిoది
ఎన్నికల ప్రచారం ముగిసిన వెంట నే మెడిటేషన్ లోకి వెళ్ళిన ప్రధాని
నాడు కేదారనాథ్లో, నేడు కన్యా కుమారిలో ధ్యానంలో మోదీ
తిరువనంతపురం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కన్యాకుమారికి ప్రధా ని మోదీ
భగవతి అమ్మ ఆలయంలో తెల్లటి ధోవతి, శాలువ ధరించి అమ్మవారి ఆలయం ప్రత్యేక పూజలు
జూన్ 1వ తేదీ శనివారం 7వ దశ పోలింగ్ ముగిసే వరకు ధ్యానము ద్రలోనే ప్రధాని
ప్రజా దీవెన, కన్యాకుమారి: దేశం లో లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు(Lok Sabha General Elections)తుది దశకు చేరుకొని ఎన్నికల తుది దశ ప్రచారం సైతం గురు వారం సాయంత్రంతో ముగిసిoది. దీంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఆనవాయితీగానే, అనుకున్నట్లుగా నే ఏకంగా నలభైఐదు గంటల పాటు కన్యాకుమారి లోని నరేం ద్రుడి ధ్యానమండపంలో నరేంద్ర మోదీ ధ్యాన ముద్రలోకి వెళ్ళారు. ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకు మారిలో 45 గంటల ధ్యానానికి కూర్చోగా జూన్ 1 వ తేదీన శనివారం 7వ దశ పోలింగ్(Polling) ముగిసే వరకు ఆయన ధ్యానముద్రలోనే గడపనున్నారు.
ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం తిరువనం తపురం(Thiruvanathapuram)నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కన్యాకుమారికి చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ భగవతి అమ్మ ఆలయంలో పూజలు చేశా రు. తెల్లటి ధోవతి, శాలువ ధరించి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షి ణలు కూడా చేశారు. తదన అనంతరం ఫెర్రీలో కన్యాకుమారి లోని రాక్ మెమోరియల్ వద్దకు చేరుకున్నారు. ఒకవైపు బంగాళా ఖాతం, మరోవైపు హిందూ మహాస ముద్రం ఇంకోవైపు నుంచి అరేబి యా సముద్రం ఇలా మూడు సాగరాలు కలిసే సంగమ స్థలి అది అని అంటారు. 1886లో రామకృష్ణ పరమహంస నిర్యాణం అనంతరం ఆయన శిష్యుడైన వివేకానందుడు పరివ్రాజకుడిగా మారి దేశమంతటా పర్యటించి, 1892 నాటికి కన్యాకు మారికి చేరుకున్నారు.
అక్కడ మూడు సముద్రాలూ కలిసే చోట ఒక రాయిపై కూర్చుని మూడు రోజులపాటు ధ్యానం చేశారు. అక్కడే ఆయనకు ఆధునిక భారతా నికి సంబంధించిన దర్శనం జరిగిం దని తన జీవితాన్ని దేశానికి అంకి తం చేయాలన్న నిర్ణయానికి ఆయ న వచ్చింది అక్కడేనని చెబుతారు. ఆయన స్మృత్యర్థం 1970లో అక్క డే రాక్ మెమోరియల్ నిర్మించారు. వివేకానందుడి అసలు పేరు నరేంద్ర నాథ్ దత్తా(Narendra Nath Dutta) అప్పట్లో ఆ నరేంద్రుడు ఎక్కడ కూర్చుని ధ్యానం చేశారో అక్కడే నిర్మించిన మండపంలో నరేంద్ర మోదీ గురువారం పద్మా సనంలో ధ్యానానికి కూర్చున్నారు. శనివారం ధ్యానం ముగిశాక తిరు వళ్లువర్ విగ్రహాన్ని ఆయన దర్శిం చను న్నారు. కాగా మోదీ రాకను నిరసిస్తూ తంతి పెరియార్ ద్రవిడర్ కళగం వంటి సంస్థలు నల్ల జెండాల తో ప్రదర్శన నిర్వహించాయి. ‘ఎక్స్’ లో ‘గోబ్యాక్మోదీ’ హ్యాష్ట్యాగ్తో పోస్టులు వెల్లువెత్తాయి.
ఈ నేప థ్యంలో 2000 మంది సిబ్బందితో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Home Minister Amit Shah) గురువారం తమిళనాడులోని పుదు కోట జిల్లా తిరుమయం ప్రాంతంలో ఉన్న పురాతన సత్యగిరీశ్వరర్ ఆల యానికి సతీసమేతంగా వచ్చి ప్రత్యే క పూజలు చేశారు. అనంతరం కోటభైరవర్ ఆలయంలోనూఅమిత్ షా పూజలు చేశారు.2019లో ఎన్నికల(Election) ప్రచారం ముగిశాక మోదీ ఇలా ధ్యానానికి కూర్చోవడం ఇదే మొదటిసారి కాదు. 2019లో కూడా మే 19న తుదిదశ పోలింగ్ జరగ్గా, మే 18న ఆయన కాషాయ శాలువా ధరించి కేదార్నాథ్లోని(Kedarnath) రుద్రగుహలో 17 గంటలపాటు ధ్యా నం చేశారు. ఇదిలా ఉంటే ఇలా ధ్యానం చేయడం కూడా ఒక రకమైన ప్రచారం కిందకే వస్తుందని ఇది ఎన్నికల నియమావళికి విరు ద్ధమని, ప్రజల్లో ఒక వర్గాన్ని ప్రభావి తం చేసే ప్రయత్నమేనని, మోదీ ధ్యానానికి కూర్చున్న ఫొటోలు ప్రసా రం, ప్రచురితం కాకుండా అడ్డుకోవా లని విపక్షాలు ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేస్తున్నాయి.
Modi 45 hours medition Dhyana mandapam