Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

PM Narendra Modi : తల్లుల మెడలోని మంగళసూత్రాలనూ వదలరు

తల్లులు, సోదరీమణుల వద్ద ఉన్న బంగా రాన్ని లెక్కపెట్టి, దాని గురించి పూర్తి సమాచారం సేకరిస్తామని, తర్వాత ఆ ఆస్తిని పంపిణీ చేస్తా మని కాంగ్రెస్ మేని ఫెస్టోలో పేర్కొన్నారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ గెలిస్తే మీ సంపదను ముస్లింలకు పంచుతారు
మీ ఆస్తులను చొరబాటు దారుల చేతుల్లోకి వెళ్లాలా
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఆందోళన కరంగా తీవ్ర భావజాలంతో ఉంది
రాజస్థాన్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశ ప్రజల సంపదను ముస్లింలకు పంపిణీ చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాజస్థాన్ లోని బన్స్వారాలో నిర్వహించిన ఎన్నిక ల ర్యాలీల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. అర్బన్ నక్సల్ మన స్తత్వం కలిగిన ఆ పార్టీ నాయకులు మన తల్లులు, సోదరీమణుల మెడ ల్లోని మంగళ సూత్రాలను కూడా వదలరని, వాళ్లు ఆ స్థాయికి దిగజా రారని మండిపడ్డారు.
ప్రజా దీవెన, జైపూర్: తల్లులు, సోదరీమణుల వద్ద ఉన్న బంగా రాన్ని లెక్కపెట్టి, దాని గురించి పూర్తి సమాచారం సేకరిస్తామని, తర్వాత ఆ ఆస్తిని పంపిణీ చేస్తా మని కాంగ్రెస్(Congrss) మేని ఫెస్టోలో పేర్కొన్నారని గుర్తు చేశారు. ఈ దేశంలోని ఆస్తులపై ముస్లింలకు మొదటి హక్కు ఉందని గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వమే చెప్పిందని మోదీ అన్నారు. ఈ లెక్కన దేశ ప్రజల ఆస్తులను ఎక్కు వమంది పిల్లలు ఉన్నవారికి పంపి ణీ ముస్లింలకు పంచేస్తారని, మీ ఆస్తుల ను చొరబాటుదారులకు పంచుతారని, మీరు కష్టపడి సంపాదించిన డబ్బును వారికి ఇవ్వడం మీకు ఆమోదయోగ్య మేనా మీ కష్టార్జితాన్ని జప్తు చేసే హక్కు ప్రభుత్వాలకు ఉందా అని ఆయన ప్రశ్నించారు.

మన తల్లుల వద్ద ఉన్న బంగారం ప్రదర్శన కోసం కాదని, అది వారి ఆత్మగౌరవానికి సంబంధించినదని స్పష్టం చేశారు. మంగళసూత్రం(Mangalsutra) విలువ బంగారం లోనో దాని ధరలోనో లేదని, ఆమె కలలకు ప్రతిరూపమైనదాన్ని లాక్కోవడం గురించి వారు మాట్లా డుతున్నారని ధ్వజమెత్తారు. 2006లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వివాదాస్పద ‘ఫస్ట్ క్లెయిమ్’ వ్యాఖ్యలను ఈ సందర్భం గా మోదీ ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రస్తుతం వామపక్షాల కబంధ హస్తాల్లో చిక్కుకుందని, ఆ పార్టీ మేనిఫెస్టో ఆందోళనకరంగా, తీవ్ర భావజాలంతో ఉందని ఆరోపిం చారు.
దేశమే కాంగ్రెస్ ను శిక్షి స్తోంది… కాంగ్రెస్ చేసిన పాపా లకు దేశం ఆ పార్టీని శిక్షిస్తోందని ప్రధాని మోదీ(Modi) అన్నారు. ఒకప్పుడు 400 సీట్లు గెలుచుకున్న పార్టీ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో 300 సీట్లలో కూడా పోటీ చేయలేకపో తోందని ఎద్దేవా చేశారు. వారికి పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని, దీనికి కాంగ్రె స్సే స్వయంగా బాధ్యత వహించా ల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఎన్ని కల్లో పోటీ చేయలేనివారు, గెలవలే నివారు బరిలో నుంచి పలాయనం చిత్తగించారని అన్నారు.రాజస్థాన్ నుంచి దక్షిణాది నేత ఒకరిని కాంగ్రె స్ రాజ్యసభకు పంపిందని, ఈ రాష్ట్ర సమస్యలపై ఆయన సభలో ఎప్పుడూ మాట్లాడలేదని, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan singh) ను కూడా మీరు రాజ్యసభకు పంపారని, ఆయన అనారోగ్యంతో ఉన్నారని, మీ రాష్ట్రంలో ఎన్నడైనా ఆయన్ను చూశారా, ఇప్పుడు మీరు మరో నేతను కాపాడారంటు ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేని వారు రాజస్థా న్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎంపికయ్యారని పరోక్షంగా సోనియాగాంధీని ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు.

తొలిదశ పోలింగ్ లోనే సగం రాజస్థాన్ కాంగ్రెసను శిక్షించిందని, దేశభక్తిని అణువ ణువునా నింపుకున్న రాజస్థాన్ కు కాంగ్రెస్ ఎన్నటికీ దేశాన్ని బలోపే తం చేయలేదని తెలుసునని, 201 4కు ముందునాటి పరిస్థితులు మ ళ్లీ రావాలని ఈ దేశం కోరుకోవడం లేదని, బంధుప్రీతి, అవినీతి అనే చెదపురుగులను వ్యాప్తి చేయ డం ద్వారా కాంగ్రెస్ దేశాన్ని నిర్వీర్యం చేసిందని, నేడు దేశం మొత్తం ఆ పార్టీపై ఆగ్రహంతో ఉందని, అది చేసిన పాపాలకు శిక్షిస్తోందని వివరించారు. కాంగ్రెస్ పై చాలా ఆగ్రహంతో ఉన్న యువత మళ్లీ ఆ పార్టీ ముఖం చూడలనుకోవడం లేదని మోదీ వ్యాఖ్యానించారు.
కూటమిలో కుమ్ములాటలు….
ఇండియా కూటమి పరిస్థితి ఎగిరేలోపే దారం తెగిన గాలిప టంలా తయారైందని ప్రధాని విమర్శించారు. అది పేరుకు మాత్ర మే పొత్తు అని, చాలా రాష్ట్రాల్లో కూటమిలోని భాగస్వామ్య పార్టీలు పరస్పరం కొట్లాడుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఎన్నిక ల్లో దేశంలో దాదాపు 25 శాతం సీట్లలో ఈ కూటమికి చెందిన వారు ఒకరిపై మరొకరు పోటీ పడుతున్నా రని చెప్పారు. ఎన్నికలకు ముందే ఈ స్థాయిలో కొట్టుకుంటున్నా రంటే ఇక ఆ తర్వాత దోచుకోవడానికి ఇంకెంతకు తెగిస్తారో ఊహించుకో వచ్చని, ఇలాంటి వారికి ఇంత పెద్ద దేశాన్ని అప్పగిస్తామా అని మోదీ ప్రశ్నించారు.

Modi sensational comments on congress