Kamala Maharana Feets: కమలా మహరాణా మోదీ పాదాభివందనం
లోక్ సభ సార్వత్రిక ఎన్నికల తుది దశ ప్రచారం గురువారంతో ముగియ నుంది.ఈ నేపథ్యంలో ఒడిశాలోని కేంద్రపాడ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఎన్నికల ర్యాలీ నిర్వహించారు.
ఒడిషా ఎన్నికల ర్యాలీలో ఆమె కాళ్లకు నమస్కారం
ప్రజా దీవెన, ఒడిశా: లోక్ సభ సార్వత్రిక ఎన్నికల(Lok Sabha General Elections)తుది దశ ప్రచారం గురువారంతో ముగియ నుంది.ఈ నేపథ్యంలో ఒడిశాలోని కేంద్రపాడ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఎన్నికల(Election) ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఈ ర్యాలీలో ఓ మహిళ కాళ్లను ప్రధాని నరేంద్ర మోదీ తాకి నమస్కరిం చారు. అయితే ఆమె ఎవరు, ఏమి టనే ఓ చర్చ అక్కడ జోరుగా సాగింది. ఆమె గురించి గతంలో అంటే 2024, ఫిబ్రవరి 25వ తేదీన తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ(Prime Minister Modi) తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.ఆమె పేరు కమలా మహరాణా. ఆమె వయస్సు 63 సంవత్సరాలు. కేంద్ర పాడ నగరంలోని గుల్నగర్లో నివసిస్తుంది.
అయితే కమలా మహరాణా( Kamala Maharana)ఆధ్వర్యంలో స్వయం సహాయక బృందం పని చేస్తుంది. పనికిరాని పాల ప్యాకెట్లతోపాటు మిగిలిన ప్లాస్టిక్ వ్యర్థాలను సేక రించి వాటిని అందరికీ ఉపయోగ పడే వస్తువులుగా తయారు చేస్తుంటారు. ఈ విషయాన్ని మన్ కీ బాత్(Mann Ki Bath)కార్యక్రమంలో ప్రధాని మోదీ కమలా మహరాణా గురించి పేర్కొన్నారు. వ్యర్థాల నుంచి సంప దను ఆమె సృష్టిస్తుందన్నారు. అలాగే ప్రభుత్వం తీసుకు వచ్చిన స్వచ్ఛ భారత్ అభియాన్కు ఆమె రూపు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఆమెను సోదరిగా పిలిచారు. మరో వైపు ప్లాస్లిక్ వ్యర్థాలతో రాఖీని తయారు చేసి ప్రధాని మోదీకి కానుకగా పంపిన విషయం తెలి సిందే.
Modi touched kamala maharana’s feets