Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Prime minister of India: ప్రధానిగా బాధ్యతలు స్వీకారం

దేశ ప్రధా నిగా మోదీ మూడోసారి బాధ్యత లు స్వీకరించారు. ప్రధానిగా బాధ్య తలు చేపట్టిన తర్వాత సంక్షేమానికి శ్రీకారం చుట్టారు.

రైతుల సంక్షేమమే లక్ష్యంగా మోదీ తొలి సంతకం
పీఎం కిసాన్‌ పథకం కింద 17వ విడత నిధులను విడుదల శ్రీకారం
దేశంలో 9.3 కోట్ల మంది రైతులకు రెండు వేల చొప్పున రూ. 20వేల కోట్లు నిధులు విడుదల

 

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశ ప్రధా నిగా మోదీ మూడోసారి(Narendra modi sworn) బాధ్యత లు స్వీకరించారు. ప్రధానిగా బాధ్య తలు చేపట్టిన తర్వాత సంక్షేమానికి శ్రీకారం చుట్టారు. రైతుల సంక్షేమ మే లక్ష్యంగా మోదీ తొలి సంతకం చేసి ప్రత్యేకతను చాటుకున్నారు. పీఎం కిసాన్‌ పథకం(PM Kisan Scheme) కింద 17వ విడత నిధులను విడుదల చేశారు. రైతుల అభ్యున్నతికి తమ ప్రభు త్వం కట్టుబడి ఉందన్న ఆయన, అందుకే బాధ్యతలు చేపట్టిన వెంట నే రైతులకు దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ తొలి సంతకం చేసి చరిత్ర సృష్టించారు. వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా ఆదివారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో మోదీ ప్రమాణ స్వీకారం చేసిన ఈ నేపథ్యంలో సోమవారం మోదీ అధికారికంగా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించా రు.

ఇక మూడోసారి ప్రధాని అయిన మోదీ తొలి సంతకం దేనిపై చేస్తార ని అందరిలో ఆసక్తితో ఎదురు చూ స్తున్న వారిని ఆశ్చర్యపరుస్తూ మో దీ మూడోసారి ప్రధాని అయిన త ర్వాత సంక్షేమానికి జై కొట్టారు. రైతుల సంక్షేమమే(Welfare of farmers) లక్ష్యంగా మోదీ తొలి సంతకం చేసి ప్రత్యేకతను చాటుకున్నారు. పీఎం కిసాన్‌ పథ కం కింద 17వ విడత నిధులను విడుదల చేశారు. రైతుల అభ్యు న్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన, అందుకే బాధ్య తలు చేపట్టిన వెంటనే రైతులకు సంబంధించిన దస్త్రంపై మొదటి సంతకం చేసినట్లు తెలిపారు. ఈ ఐదేళ్లలో రైతుల కోసం మరిన్ని చర్యలు చేపడతామని ఈ సంద ర్భగా మోదీ తెలిపారు.

కాగా పీఎం కిసాన్‌ పథకంలో భాగంగా దేశంలో 9.3 కోట్ల మంది రైతులకు రెండు వేలు చొప్పున 20వేల కోట్ల రూపా యల నిధులు వారి ఖాతాల్లో జమ కానున్నాయి. ఇదిలా ఉంటే మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మోదీ ఈ సాయంత్రం తొలి కేబినెట్(Modi cabinet) భేటీ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఈ సమా వేశం ఉండనుంది. అయితే అంత లోపు మంత్రులకు శాఖల కేటాయిం పు ప్రక్రియ పూర్తికానుందని తెలు స్తోంది. మోదీ నేతృత్వంలో జరగను న్న మంత్రి మండలి సమావేశంలో 71 మంది మంత్రులు పాల్గొంటారు. ప్రభుత్వ లక్ష్యాలు, విధానాలపై కొత్త మంత్రులకు మోదీ దిశానిర్ధేశం చేయనున్నారు. మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 120 రోజుల కార్యాచరణను సిద్ధం చేసుకున్నట్లు చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

Narendra modi sworn as Prime minister of India