Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

RevanthReddy: మోదీ వారంటీ తీరిపోయింది

లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో బీజేపీ మోదీ గ్యారెంటీకి వారంటీ తీరిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించా రు.

యూపీలో ఓటమికి ఆయన బాధ్యత వహించాలి
తెలంగాణలో 3 ఎంపీ సీట్లుంటే ప్రస్తుతం 8 గెలిచాం
ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్‌ రెడ్డి

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో(Lok Sabha election results) బీజేపీ మోదీ గ్యారెంటీకి వారంటీ తీరిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించా రు. ఆయనకు కూడా ఫలితాల తీరుతో వారంటీ ఖతమైందని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)ఎద్దేవా చేశారు. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలో బీజేపీ ఓటమికి బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. గత పదేళ్లలో మోదీ సర్కారు యువత, రైతులను వెన్నుపోటు పోడిచిందని విమర్శిం చారు. శనివారం ఢిల్లీలోని ఆశోకా హోటల్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ వారాణసీలో ప్రధాని మోదీకి మెజారిటీ తగ్గిందన్నారు. లోక్‌సభలో మోదీ సర్కారును నిల దీసేందుకు ప్రతిపక్ష నేతగా రాహుల్‌ బాధ్యతలు తీసుకోవాలని దేశం లోని 140 కోట్ల ప్రజలతో పాటు కాంగ్రెస్‌(Congress) కోరుకుంటోందన్నారు. తెలంగాణలో(Telangana) కాంగ్రెస్‌కు 3 ఎంపీ లుంటే ఈ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచినట్లు చెప్పారు. 64 మంది ఎమ్మెల్యేలకు తోడు కొత్తగా కంటో న్మెంట్‌ స్థానాన్ని గెలుచుకున్నామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 శా తం ఓట్లు తమ పార్టీకి రాగా, లోక్‌ సభ ఎన్నికల్లో 41 శాతం ఓట్లు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.

సోనియా, రాహుల్ తో రేవంత్‌ భేటీ కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాతో సీఎం రేవంత్‌ ఆమె నివాసంలో ఉద యం సమావేశమయ్యారు. సుమా రు అరగంట పాటు సాగిన ఈ భేటీ లో సోనియాతో(Sonia) పలు విషయాలు చర్చించారు. పీసీసీ అధ్యక్ష పదవి, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పనితీరు, ఫలితాలపై వివరించినట్లు తెలిసిం ది. తెలంగాణ తల్లి ఉత్సవాలు, అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంటు ఎన్నికల్లో(Parliamentary elections)పార్టీ ఓటు బ్యాంకు పెర గడం, బీజేపీ గెలిచిన 8 సీట్లలో 7 చోట్ల బీఆర్‌ఎస్‌ డిపాజిట్లు కోల్పో వడం, బీజేపీకి బీఆర్‌ఎస్‌ లోపాయి కారిగా సహకారం అందించిందని ఆయన ప్రస్తావించినట్లు సమాచా రం. అనంతరం సోనియా నివాసం నుంచి నేరుగా సీడబ్ల్యూసీ భేటీకి వెళ్లారు. కాగా, సాయంత్రం సీఎం రేవంత్‌ను పార్టీ ఎంపీలు రఘువీ ర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి(Chamala Kiran Kumar Reddy), రఘురామ్‌రెడ్డి, బలరాంనాయక్‌, మల్లు రవి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.

Narendra Modi’s warranty expired