–దక్షిణాది చిత్రాలకు అవార్డుల పంట
–జాతీయ ఉత్తమ నటుడు గా ‘కాంతారా ‘ రిషబ్ శెట్టి
–ఉత్తమ చిత్రంగా మలయాళ చిత్రం ఆట్టమ్ ఎంపిక
— మన కార్తీకేయ 2 కు ఉత్తమ ప్రాం తీయ చిత్రంగా అవకాశం
National Film Awards: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: జాతీయ చలనచిత్ర అవార్డులు (National Film Awards) శుక్రవారం ప్రకటించారు. గత ఏడా ది తెలుగు సినిమాకు ఉత్తమ జాతీయ నటుడు (Best National Actor) అవార్డు సహా తొమ్మిది అవార్డులు రావడంతో కాలరు ఎగ రేసిన తెలుగు ప్రేక్షకుడు ఈసారి ప్రక టించిన అవార్డుల్లో తెలుగు సిని మాకు ఒక్కటంటే ఒక్క అవార్డ్ కూ డా లేకపోవడం చూసి ఆశ్చర్యపో యాడు. ఇలా ఎందుకు జరిగిందని ఆలోచనలో పడ్డాడు. తెలుగు రాష్ట్రా లు విడిపోయిన తర్వాత సిని మాలకు ప్రభుత్వ అవార్డులు అన్నవి లేనేలేవు. ఇప్పుడైనా ఇస్తా రో, ఇవ్వరో తెలియని పరిస్థితి. ఫిల్మ్ ఫేర్ వంటి ప్రైవేట్ అవార్డుల ను పక్కన పెడితే, సినిమా ప్రము ఖులు ఆశించేది, రావాలని కోరు కునేది జాతీయ చలనచిత్ర అవార్డు లే. జాతీయ అవార్డ్ పొందితే కెరీర్ పరంగా ఏదో సాధించామనే సం తృప్తి చాలా మందికి ఉంటుంది. అయితే జాతీయ అవార్డు అందు కునే స్థాయి కలిగిన చిత్రాలు తెలు గులో ఎన్ని వస్తున్నాయనేది ఒక ప్రశ్న. తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంట్కు కొదువ లేదు. సినీ ప్రపంచమంతా తెలుగు చిత్ర పరిశ్ర మ వైపే చూస్తున్న రోజులివి. కొత్త తరహాగా ఆలోచించడం, కష్టపడే తత్వం తెలుగు వారికి ఎక్కువ. అయినా సరే కొత్త తరహా చిత్రాల గురించి ఆలోచించకుండా కమర్షి యల్ చిత్రాలపై మోజుతో నిర్మాత లు పరుగులు తీస్తున్నారన్నది ఎవరూ కాదనలేని సత్యం. కాకపో తే ఈ ఏడాది ఢిల్లీకి పంపిన చిత్రా ల్లో అవార్డుకు అర్హమైనవి కొన్ని ఉండడం వాటికి ఒక్క అవార్డ్ (award)కూడా రాకపోవడం చర్చనీయాంశం అయింది.
కరోనా కారణంగా ..
శుక్రవారం ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ (national awards) 2022 సంవత్సరం లో సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలకు సంబంధించినవి. వాస్తవానికి 2023 మే 3న ఈ అవార్డులను ప్రదానం చేయాలి. అయితే కరోనా తర్వాత జాతీయ చలన చిత్ర అవార్డుల షె డ్యూల్లో మార్పులు జరిగియి. అవా ర్డుల ఎంపిక, ప్రదాన కార్యక్ర మం (Selection and presentation of awards)ఆలస్యమవుతూ వస్తున్నా యి. లోకసభకు జరిగిన ఎన్నికల కారణంగా జాతీయ అవార్డులు ఈసారి మరింత ఆలస్యమయ్యా యి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించ డానికి ముందే అవార్డుల ఎంపిక ప్రక్రియ మొదలైనా ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో దానిని మధ్యలోనే ఆపేసి ఎన్నికల ఫలి తాలు వెల్లడి అయ్యాక మళ్లీ మొద లుపెట్టారు. ఇప్పుడు ప్రకటించిన అవార్డులను అక్టోబరు నెలలో విజేతలకు అందజేస్తారని సమా చారం.
ఇరవై సినిమాల్లో ఒకే ఒక్క అవార్డ్ (award) …జాతీయ అవార్డుల కోసం తెలుగు నిర్మాతలు ఈసారి పెద్ద సంఖ్యంలోనే ఎంట్రీలు పంపా రు. ఆ జాబితాలో ఉన్న సినిమాలు ఏమిటంటే 1. రైటర్ పద్మభూషణ్, 2. సీతారామం 3. అంటే సుంద రానికి.. 4. విరాటపర్వం 5. యశోద 6. రాధేశ్యామ్ 7. సర్కారు వారి పాట 8. మర్రి చెట్టు 9. కుదిరామ్ బోస్ 10. ఇట్లు మారేడుమిల్లి 11. కార్తికేయ 2 12. డీజె టిల్లు 13. ఇక్షూ 14. ధమాకా 15. చదువే నా ఆయుధం 16. బింబిసార 17. భారత పుత్రులు 18. ఎట్ లవ్ 19. అశోకవనంలో అర్జున కల్యాణం 20. అల్లూరి. ఇన్ని సినిమాలు పంపిస్తే వాటిల్లో ఒక్కటంటే ఒక్కదానికి కూడా ఏ అవార్డూ దక్కలేదు. ఇది ఆలోచించాల్సిన అంశం. ‘కార్తికేయ 2’ చిత్రానికి ఇచ్చారు కదా అని అంటే అది ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరిలో (Image category) ఇచ్చిన అవార్డు. ఆ ఆవార్డు తెలు గు సినిమాకే ఇవ్వాలి కనుక కంటి తుడుపు అన్నట్లు ‘కార్తికేయ 2’కు ప్రకటించి చేతులు దులుపేసుకుంది అవార్డుల కమిటీ.
ఆ రెండు సినిమాలను (movies) పక్కన పెట్టేశారా? ‘యుద్ధం రాసిన ప్రేమలే ఖ’ అనే ట్యాగ్లైన్తో రూ పుదిద్దుకొన్న చిత్రం ‘సీతారా మం’ వైజయంతీ మూవీస్ సంస్థ సగ ర్వంగా సమర్పించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించిన సినిమా ఇదని టాలీవుడ్ సెలబ్రేట్ చేసుకుంది. చక్కని కథ, కథనాలతో రూపుదిద్దుకున్న ‘సీతారామం’కు జాతీయ అవార్డు ఖాయం అని అందరూ అనుకున్నారు. తీరా శుక్రవారం ప్రకటించిన అవార్డుల జాబితాలో ఆ సినిమా ఊసే లేదు. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే ‘సీతారామం’ చిత్రం చివరి వరకూ పోటీలో ఉంది. అయితే అందులో సుమంత్ పోషిం చిన పాత్ర పాకిస్థాన్కు అనుకూ లంగా ఉందనే సాకుతో అవార్డుల కమిటీ సినిమాను పక్కను పెట్టేసిం దట. అలాగే నక్సలైట్లకు అనుకూ లంగా, నక్సలిజాన్ని సమర్ధించే రీతి లో ‘విరాటపర్వం’ చిత్రం ఉందంటూ ఆ సినిమాను కూడా పక్కన పెట్టే శారని అంటున్నారు. కల్యాణ్రామ్ నటించిన ‘బింబిసార’ చిత్రం కూడా కొత్త తరహా ప్రయత్నం. ఆ సినిమా ను కూడా అవార్డుల కమిటీ పట్టిం చుకోలేదు. జ్యూరీలో తెలుగు సభ్యుడు కనీసం ఒకరున్నా తెలుగు సినిమాకు ఇలా అన్యాయం జరిగేది కాదనీ, పైట్ చేసి ఏదో ఒక సినిమా కు అవార్డ్ (award)తీసుకువచ్చేవారని అం టున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన సభ్యులు ఎవరూ లేకపోవడంతో . ఇతర భాషల వా రు పెత్తనం చెలాయించి, అవార్డుల పరంగా తెలుగు సినిమాకు అన్యా యం చేశారని చిత్ర ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వారికి అవార్డులు ఇచ్చారు కానీ..
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ముగ్గురికి ఈసారి జాతీయ అవా ర్డులు రావడం కొంతలో కొంత ఉపశ మనం. అయితే వారు అవార్డులు పొందింది తెలుగు చిత్రాలకు కాదు.. తెలుగేతర చిత్రాలకు.నిత్యా మీన న్కు (nithya menon) జాతీయ ఉత్తమ నటిగా అవా ర్డ్ వచ్చింది. అయితే తెలుగు సిని మా కాదు ‘తిరుచిట్రంబలం’ తమిళ చిత్రం. అలాగే ఎ.ఆర్.రెహమాన్ కూడా తమిళ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 1’ చిత్రానికే ఉత్తమ నేపథ్య సంగీతం అవార్డ్ పొందారు. అదే వి ధంగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా తమిళ సినిమాతోనే జాతీ య అవార్డ్ పొందారు.