దేశం సుస్థిరత అస్థిరత…. ఒకవైపు ఎన్డీఏ, మరో వైపు ఇండియా
దేశాన్ని మరింత మెరుగుపరచేందుకు బీ జేపీ సారథ్యంలోని ఎన్డీయే ఒకవైపు సుస్థిరతతో, మరో వైపు దేశంలో అస్థిరత సృష్టించేందుకు ఇండియా కూటమి ఒకవైపు ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
జాతీయ ప్రయోజనాలకై బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే అంకితo
ప్రజలు మాకు హ్యాట్రిక్ కన్ఫర్మ్ చేశారన్న ప్రధాని మోదీ
ప్రజా దీవెన, రాయ్ బరేలి: దేశాన్ని మరింత మెరుగుపరచేందుకు బీ జేపీ సారథ్యంలోని ఎన్డీయే ఒకవైపు సుస్థిరతతో, మరో వైపు దేశంలో అస్థిరత సృష్టించేందుకు ఇండియా కూటమి ఒకవైపు ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాల కోసం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే పరిపూర్ణంగా అంకితమైందని చెప్పారు. రాయబ రేలి ప్రజలు ప్రధానిని ఎన్నుకుంటా రంటూ కాంగ్రెస్ నేత ఒకరు చెప్ప డాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం ‘హ్యాట్రిక్’ సాధించి తీరుతుందని, ఇండియా కూటమి నేతలు ఒక్కొక్క రే జారుకుంటున్నారని అన్నారు.
సమాజ్వాదీ పార్టీ రాజకుమారుడు (అఖిలేష్ యాదవ్), ఒక కొత్త ఆంటీ (మమతా బెనర్జీ) గొడుగు కింద చే రారని, ఆ కొత్త ఆంటీ పశ్చిమబెం గాల్లో ఉందని, మీకు బయట నుంచి మద్దతు ఇస్తామని ఆ కొత్త ఆంటీ ఇండియా కూటమికి చెబు తోందని మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నికలు నడుస్తున్న కొద్దీ ఇండి యా కూటమి నేతలు ఒక్కొక్కరే కూటమి నుంచి జారిపోరుతు న్నారని చెప్పారు. కేంద్రంలో రాబో యే కొత్త ప్రభుత్వంలో పేదలు, యువకులు, మహిళలు, రైతుల కోసం ఎన్నో పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకోనున్నామని మోదీ చెప్పారు. ఇండియా కూటమి నేతలు ప్రధాను లవుతామంటూ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
తాను ‘హ్యాట్రిక్’ కొట్టేందుకు, సమాజంలోని అన్నివర్గాల కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. 500 ఏళ్ల తర్వాత రామా లయం కల సాకారమైందంటే దానికి ప్రజల ఓటు బలమే అందుకు కార ణమని అన్నారు. రామమందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తోసి రాజనేందుకు, మందిరంపై బుల్డో జర్ నడిపేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్టు తమకు తెలిసిందని, న్యాయబద్ధంగా బుల్డోజర్ నడిపిం చడం ఎలాగో యోగి ఆదిత్యనాథ్ నుంచి వాళ్లు (కాంగ్రెస్) తెలుసుకో వాలని సూచించారు. ఇండియా బ్లాక్కు ప్రజలు ఓటు వేసి అధికారం ఇస్తే, ఎస్సీ, ఎస్టీ, ఆదివాదీ, ఓబీసీల రిజర్వేషన్లను లాక్కొని తమ ఓట ర్లకు ఇవ్వడం ద్వారా బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతుందని హెచ్చరించారు.
NDA vs INDIA