NEET grace marks cancelled: సుప్రీం తీర్పు…. ‘నీట్’ గా గ్రేస్ మార్క్స్ రద్దు
వైద్య విద్య లోఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర వై ద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వ హించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) – యూజీ 2024లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తిన వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
గ్రేస్ మార్కులు పొందిన 1563 మందికి సుప్రీంకోర్టు షాక్
తిరిగి వారందరికీ పరీక్ష నిర్వహిం చేందుకు అనుమతి
ఈ నెల 23న ఆ 1563 మందికి నీట్ ఎగ్జామ్
ప్రస్తుత కౌన్సెలింగ్ షెడ్యూల్ యథాతథం
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: వైద్య విద్య లోఎంబీబీఎస్(MBBS), బీడీఎస్(BDS) ఇతర వై ద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వ హించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(National Eligibility Entrance Test) (నీట్) – యూజీ 2024లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తిన వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ ఫలితాల్లో 1563 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కు లను తొలగిస్తామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వారికి మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని చెప్పిం ది.ఈ ఏడాది జరిగిన నీట్ పరీక్షలో 1563 మంది విద్యార్థులకు అదనం గా గ్రేస్ మార్కులు ఇచ్చారు. ఎన్సీ ఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో మార్పు లు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవ డంతో వీటిని కలిపారు. అయితే దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవ డంతో పాటు నీట్ పరీక్షలో అక్రమా లపై ఆరోపణలు రావడంతో గతవారం కేంద్ర విద్యాశాఖ నలుగురు సభ్యులతో కమిటీ వేసింది.
కోల్పోయిన సమయానికి పరిహారంగా గ్రేస్ మార్కులు(Grace Marks) పొందిన 1563 విద్యార్థులపై ఈ కమిటీ విచారణ జరిపి నివేదిక సమర్పించింది. కమిటీ నిర్ణయాలను కేంద్రం గురు వారం సుప్రీంకోర్టుకు తెలియ జేసింది. ”కోల్పోయిన సమయానికి పరిహారంగా గ్రేస్ మార్కులు పొం దిన ఆ 1563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేయాలని కమిటీ నిర్ణయించింది. వారికి మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పి స్తాం. జూన్ 23న పరీక్ష నిర్వహించి ఈనెల 30వ తేదీలోగా వారి ఫలితాలను ప్రకటిస్తాం” అని ధర్మాసనానికి కేంద్రం వెల్లడించింది.
ఆ తర్వాతే కౌన్సెలింగ్(Counselling) ఉంటుందని తెలిపింది. ఒకవేళ మళ్లీ పరీక్ష రాయొద్దని అనుకునే వారు.. గ్రేస్ మార్కులు లేకుండా ఒరిజినల్ మార్కులతో కౌన్సెలింగ్కు వెళ్లొచ్చని పేర్కొంది.ఇక, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు(Supreme Court) గురువారం విచారణ జరిపింది.(Web Counselling) వెబ్ కౌన్సెలింగ్పై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. కౌన్సెలింగ్ యథాతథంగా ఉంటుందని చెప్పిన ధర్మాసనం.. ఈ పిటిషన్లపై రెండు వారాల్లోగానే సమాధానం చెప్పాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది. జులై 6వ తేదీ నుంచి నీట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.
NEET grace marks cancelled