–విశ్వవ్యాప్తంగా మూడవ అత్యు న్నత వాతావరణ సంస్థగా గుర్తింపు.
New Delhi : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఇండియాలో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా జాతీయoగా, అంతర్జా తీయoగా అందరి అభిమానాన్ని చూరగొoటుంది భారత వాతావర ణ కేంద్రం. అనాదికాలంగా దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా కాస్త అటు ఇటుగా కచ్చితత్వమైన సమాచారాన్ని చేరవేస్తూ విశేషంగా మన్ననలు పొందుతుందంటే అతి శయోక్తి కాదు. భారతదేశ ప్రజలకు చిరకాల పరిచయంతో వాతావరణ వార్తలు ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ, ప్రకృతి విపత్తులపై అప్రమత్తం చేస్తున్న భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ప్రస్థానం కీలక మైలురాయికి చేరింది. రైతులకు, ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న ఈ విభాగం ఈ నెల 15వ తేదిన 149 ఏండ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకొని 150 ఏండ్లలోకి అడుగు పెడుతు న్నది. 1875 జనవరి 15న చిన్న సంస్థగా ప్రారంభమైన ఐఎండీ అం చెలంచెలుగా ఎదుగుతూ నేడు ఒక విశాల వృక్షంలా రూపాంతరం చెందింది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని వాతావరణ పరి స్థితులను కచ్చితత్వంతో అంచనా వేయడంలో దిట్టగా నిలుస్తూ ప్రపం చంలోనే మూడో అత్యున్నత వా తావరణ విభాగంగా గుర్తింపు పొం దడం భారతీయులందరికీ గర్వకా రణం. ఐఎండీ అందిస్తున్న నిర్దిష్టమైన సేవలు, సమాచారం వల్ల మన దేశంలో విపత్తుల సమ యంలో ఆస్తి, ప్రాణ నష్టాన్ని గణనీ యంగా తగ్గుతున్నది వాస్తవం.
నాడు దేశీయంగా నేడు అంత ర్జాతీయంగా.. భారతదేశంలో 1864లో సంభవించిన తీవ్రమైన తుఫాను, 1866, 1871లో తీవ్రమై న విపత్తులు సంభవించిన విష యం తెలిసింది. ఈ నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను ముం దుగా అంచనా వేయడం ద్వారా ఆస్తి, ప్రాణనష్టాన్ని అరికట్టేందుకు నాడు భారత్ లోని నాటి బ్రిటీష్ ప్రభుత్వం ఐఎండీని స్థాపించింది. అప్పట్లో కేవలం కొన్ని వర్ష కొలమా న పరికరాలే ఐఎండీ దగ్గర అందు బాటులో ఉండేవి. కాలక్రమేనా ఆధునిక సాంకేతికతను ఐఎండీ అందిపుచ్చుకున్న ఐఎండీ 2023 నివేదిక ప్రకారం ఐఎండీ 39 డాప్లర్ వెదర్ రాడార్స్ 15 నిమిషాలకో సారి వివరాలు అందించే ఇన్ షా ట్స్ 3డీఆర్ శాటిలైట్స్, 806 ఆటో మేటిక్ వెదర్ స్టేషన్స్, 200 ఆగ్రో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్, 5896 వర్ష నిర్వహణ కేంద్రాలు, 63 పైల ట్ బెలూన్ స్టేషన్లను అందిపుచ్చు కుంది. 150 ఏండ్ల ప్రస్థానంలో ఐఎండీ కీలకమైన పురోగతిని సాధించిందనడంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులను, నిర్ది ష్టంగా ఒక గ్రామంలో పడే వర్షపా తం తీరును త్వరిత గతిన తెలిపే టెక్నాలజీ, అత్యా ధునిక ఉపగ్రహ వ్యవస్థలను సమకూర్చుకుంది.
రాగల కొన్ని గంటలతో పాటు మొత్తం సీజన్ లో పరిస్థితులను అంచనా వేయగలిగే సాంకేతికత ను 2016 నుంచి 2021 మధ్య అందుబాటులోకి తీసుకొచ్చింది. వాతావరణ పరిస్థితులను కచ్చిత త్వంతో అంచనా వేయడంలో ప్రపంచంలోనే భారత వాతావరణ విభాగం మూడో స్థానంలో నిలిచిం ది. భారత వాతావరణ విభాగం హిందూ మహా సముద్రతీరంలోని 13 దేశాలతో పాటు, సార్క్ దేశా లకు వాతావరణ సేవలు అంది స్తున్నది. నేపాల్, మాల్దీవులు, శ్రీలంక, బంగ్లాదేశ్, మారిషస్కు ముందస్తు హెచ్చరికలు చేయడం ద్వారా విపత్తుల నుంచి ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించేందుకు దోహ దపడుతున్నది. ఐఎండీ ఆధ్వర్యం లో మిషన్ మౌసమ్ ద్వారా వాతా వరణ పరిస్థితులను మరింత కచ్చి తత్వంతో అంచనా వేస్తున్నది. ఇటీ వల కృత్రిమ మేధను కూడా ఐఎం డీ ఉపయోగిం చుకుంటున్నది. మాసమ్ మిషన్లో భాగంగా ప్రత్యేక ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ఇందులో కృత్రిమంగా వాతావరణ పరిస్థితులను సృష్టించారు.