Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Occult worship: అనుమానం వారిని పొట్టన పెట్టుకుంది

–చేతబడి నెపంతో తొమ్మిది మంది హత్య
–చత్తీస్‌గఢ్‌లో 4 రోజుల వ్యవధిలో రెండు దారుణాలు
–దారుణoగా మృతుల్లో 11 నెలల పసికందు

Occult Worship: ప్రజా దీవెన, రాయ్‌పూర్‌: చేతబడి (occult worship) చేస్తున్నారనే అనుమానంతో రెండు కుటుంబాలకు చెందిన 9 మందిని ఇరుగుపొరుగు వారే అతి కిరాతకంగా చంపేశారు. ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) రాష్ట్రంలో 4 రోజుల వ్యవధిలో ఈ రెండు దారుణాలు చోటు చేసుకున్నాయి. ఆదివారం సుక్మా జిల్లా (Sukma) ఇట్కల్‌ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిపై గొడళ్లు, కర్రలతో దాడి చేసి హతమార్చారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులున్నారు. మృతులను మౌసం కన్నా (60), బుచ్చా (34), అర్జో (32), బీరి, కర్కలచ్చి (43)గా పోలీసులు గుర్తించారు.

మౌసం కన్నా కుటుంబం నిర్వహిస్తున్న క్షుద్రపూజల కారణంగా పలువురు చిన్నారులు (Childrens) అనారోగ్యం బారిన పడ్డారని ఆరోపిస్తూ గ్రామస్థులు ఈ దాడికి ఒడిగట్టినట్లు జిల్లా ఎస్పీ కిరణ్‌ జి చవాన్‌ (Kiran Ji Chahan) తెలిపారు. అంతకుముందు ఈ నెల 12న గురువారం ఛార్‌ఛెడ్‌ గ్రామంలోనూ ఒకే కుటు బానికి చెందిన నలుగురిని పొరుగింటి వారే చంపేశారు. మృతుల్లో 11 నెలల మగ శిశువు కూడా ఉన్నాడు.

మృతులను చైత్రం కైవర్త్య(47), యశోద (30), జమున (28), యశ్‌ (11 నెలలు)గా గుర్తించారు. చైత్రం కైవర్త్య తల్లి చేస్తున్న క్షుద్రపూజల కారణంగా తమ కూతురి ఆరోగ్యం దెబ్బతిందని ఆరోపిస్తూ పొరుగింట్లో ఉండే రాంనాథ్‌ పాట్లే కుటుంబం ఈ దాడి చేసిందని పోలీసులు చెప్పారు.