Odisha CM: ఒడిసా సీఎం గా గిరిజన నేత
ఒడిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రిగా గిరిజన నేతను ఎంపిక చేసింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం.
అన్నట్లుగానే అవకాశం కల్పించిన బీజేపీ అధిష్టానం
భువనేశ్వర్లో నేడు ప్రమాణ స్వీకారం, ప్రధాని హాజరు
ప్రజా దీవెన ఒడిసా: ఒడిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రిగా గిరిజన నేతను ఎంపిక చేసింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం. ముందస్తుగా ప్రకటించిన విధంగానే తొలిసారి ఒడిసాలో అధికారం దక్కించుకున్న బీజేపీ గిరిజన నేతకు ముఖ్యమం త్రిగా అవకాశం కల్పించింది. కి యోంజర్ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ చరణ్ మాఝీ(Mohan Charan Majhi)(52)ని సీఎంగా ఎంపిక చేసింది. ప్రవతీ పరిడా, కేవీ సింగ్దేవ్లకు ఉప ముఖ్యమంత్రులు పదవులు దక్క నున్నాయి.
మంగళవారం భువనే శ్వర్లో(Bhuvaneshwar)ఒడిసా బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్నాథ్సింగ్, భూపేంద్ర యాదవ్ పరిశీలకులుగా హాజరయ్యారు. అనంతరం మాఝీని శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ట్లు రాజ్నాథ్ ప్రకటించారు. బుధ వారం సాయంత్రం మాఝీ, పలువు రు మంత్రులు ప్రమాణం చేయను న్నారు. ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వాన తొలి పత్రికను ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలోని జగన్నాథస్వామికి(Jagannath Swamy)సమ ర్పించి పూజలు చేయించారు. ప్రమా ణ స్వీకార కార్యక్రమానికి బీజేడీ అధినేత, మాజీ సీఎం నవీన్ పట్నాయక్ను ఆహ్వానించారు. కాగా, ప్రధాని మోదీ(Prime Minister Modi), పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీఎంలు సైతం దీనికి హాజరవనున్నారు. 147 సీట్లున్న ఒడిసాలో ఎన్నికల్లో బీజేపీ 78 గెలుచుకుని తొలిసారిగా అధికారం చేపట్టనుంది.
వాచ్మన్ కుమారుడు నుంచి…మోహన్ చరణ్ 1997– 2000 మధ్యన ఆదివాసీ ప్రాంతం రాయికల సర్పంచ్గా పనిచేశారు. ఈయన తండ్రి వాచ్మన్. కాగా, 2000 సంవత్సరంలో మాఝీ తొలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004, 2019లోనూ నెగ్గారు. ప్రజా సంబంధాలు, సంస్థాగతంగా బీజేపీ(BJP) బలోపేతానికి కృషి చేశారు. మరో వైపు జార్ఖండ్లో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఒడిసా పొరుగున ఉండే ఈ రాష్ట్రంలో గిరి జనులు 26 శాతం పైగా ఉంటారు. వారిని మచ్చిక చేసుకునే ఉద్దేశం లోనే మాఝీని ఒడిసా సీఎం చేసి నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.
గత ఏడాది చివర లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో సీనియర్ నాయకులు, సీఎంలుగా పనిచేసిన శివరాజ్ చౌహాన్(Shivraj Chauhan), రమణ్సింగ్, వసుంధరా రాజెలను పక్కనపెట్టి కొత్తవారికి అవకాశం ఇచ్చింది బీజేపీ. ఒడిసాలోనూ ఇదే తర హాలో ఆశ్చర్యకర ఎంపిక చేపట్టిం ది. కాగా, కేంద్ర మాజీ మంత్రి రవిశం కర్ ప్రసాద్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్లను(Tarun Chugh)అరు ణాచల్ ప్రదేశ్ సీఎం ఎంపికకు పరిశీలకులుగా బీజేపీ నియమిం చింది. వీరు బుధవారం ఇటానగర్ వెళ్లనున్నారు. ప్రస్తుత సీఎం పెమా ఖండూనే మళ్లీ ఎన్నుకునే వీలుంది.
Odisha cm mohan charan manjhi