market scam: మార్కెట్ స్కామ్ పై పార్లమెంటరీ కమిటీ విచారణ
ప్రధాని న రేంద్ర మోదీ, అమితే, వారి కోసం పనిచేసే ఎగ్జిటోపోల్స్ సంస్థలు కలి సి దేశంలోనే భారీ స్టాక్ మార్కెట్ కుంభకోణానికి పాల్పడ్డారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరో పణలు చేశారు.
ఎన్నికల ఫలితాల రోజు రూ.30 లక్షల కోట్ల సంపద ఆవిరి
ఉద్దేశ్యపూర్వక ఈ పతనం వెనక మోదీ, షా కుట్ర
అదానీ కుంభకోణం కంటే అతి పెద్దదిగా అవతరించింది
భారీ స్టాక్ మార్కెట్ స్కామ్ జరిగిందంటూ రాహుల్ ఫైర్
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ప్రధాని న రేంద్ర మోదీ(Prime Minister Narendra Modi), అమితే, వారి కోసం పనిచేసే ఎగ్జిటోపోల్స్ సంస్థలు కలి సి దేశంలోనే భారీ స్టాక్ మార్కెట్ కుంభకోణానికి పాల్పడ్డారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)తీవ్ర ఆరో పణలు చేశారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల రోజున స్టాక్ మార్కెట్ పతనమవ్వడంతో 5 కోట్ల మంది మదుపరులు భారీగా నష్ట పోయా రని, రూ.30 లక్షల కోట్ల మేర ఇన్వె స్టర్ల సంపద ఆవిరైందని చెప్పారు. ఈ కుట్రపై మోదీ, అమిత్, ఎగ్జిట్ పోల్ సంస్థలు, విదేశీ ఇన్వెస్టర్లపై విచారణకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేయా లని డిమాండ్ చేశారు. గురువారం ఆయన కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం లో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, పవన్ భేరా, సుప్రియా శ్రీనాథేతో కలిసి మాట్లాడారు.
ఒక క్రమపద్ధతిలో ఈ కుంభకోణం జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(Securities Exchange Board of India) దర్యాప్తు జరుగుతున్న ఓ కంపెనీకి చెందిన న్యూస్చానల్ కు మోదీ, అమిత్ ఇంటర్వ్యూలిస్తూ జూన్ 4లోపు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని, ఆ తర్వాత షేర్ల రేట్లను అందుకోలేరన్నట్లుగా మదుపరు లకు సలహాలిచ్చారన్నారు.మే 13న అమిత్ ఆ చానల్ కు ఇచ్చిన ఇంట ర్వ్యూలో జూన్ 4లోపు షేర్లు కొనా లన్నారు. అదే నెల 19న మోదీ ఇంటర్వ్యూ ఇస్తూ అదే మాట చె ప్పారు. జూన్ 4న స్టాక్ మార్కెట్ రికార్డులు బద్దలవుతాయన్నారు. జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ విడుదల య్యాయి. జూన్ 3న స్టాక్ మార్కెట్ సూచీలు ఆల్టైమ్ గరిష్ఠానికి చేరుకు న్నాయి. ఎన్నికల ఫలితాల రోజు స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింద ని రాహుల్ గుర్తుచేశారు.స్టాక్ మా ర్కెట్ల(Stock markets)గురించి గతంలో ఏ ప్రధాని కూడా మాట్లాడలేదని, మోడీ, షా మదుపరులకు ఎందుకు పిలుపు నిచ్చారని నిలదీశారు.
స్టాక్స్ సల హాలివ్వడమే వారి పనా అని ప్రశ్నిం చారు. వారిద్దరూ ఇంటర్వ్యూ ఇచ్చి న న్యూస్ చానల్ కు కూడా ఈ కుంభకోణంతో సంబంధం ఉందా అని అనుమానం వ్యక్తం చేశారు. స్టాక్ మార్కెట్ పతనానికి, అదానీ కుంభకోణానికి ముడిపడి ఉందా అని విలేకరులు ప్రశ్నించగా.. “స్టాక్ మార్కెట్ కుంభకోణం అదానీ స్కా మ్ కంటే చాలా పెద్దదని రాహుల్ సమాధానమిచ్చారు.
ఆరోపణలను అవాస్తవమన్న బీజేపీ..రాహుల్గాంధీ ఆరోపణల పై బీజేపీ నేత పీయూషగోయల్(Piyushgoyal)తీవ్రంగా స్పందించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ రాహుల్ గాంధీవి నిరాధా రమై న ఆరోపణలు అని కొట్టిపారేశారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ని జీర్ణించుకోలేకే ఇలా ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రధాని మోదీ భారత్ ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశలో అడుగు లు వేస్తున్నారని చెప్పారు. ఇన్వెస్టర్ల ను తప్పుదోవ పట్టించేందుకు రాహుల్ చేస్తున్న కుట్రలో భాగమే ఈ ఆరోపణలు అని ఆయన పేర్కొన్నారు.
Parliamentary Committee Inquiry market scam