PM Modi:అయినోళ్లను అంచున కానోళ్లను కంచాన పెడుతున్నారు
దేశాన్ని పరిపాలించిన మన రాజులు మహారాజులను అగౌరవపరుస్తూ నవాబులు, నిజాములను మాత్రం పల్లెత్తు మాట అననియ్యడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోధీ ధ్వజ మెత్తారు.
నవాబులు, నిజాంలపై ఈగనైనా వాలనీయడం లేదు
దేశాన్ని పాలించిన మహారాజు లను అగౌరవపరుస్తున్నారు
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ పై ప్రధాని మోదీ ఫైర్
ప్రజా దీవెన, కర్ణాటక: దేశాన్ని పరిపాలించిన మన రాజులు మహారాజులను అగౌరవపరుస్తూ నవాబులు, నిజాములను మాత్రం పల్లెత్తు మాట అననియ్యడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోధీ(PM Narendra Modi) ధ్వజ మెత్తారు. అయినవారిని అంచున పెట్టి కానీ వారిని కంచాన పెట్టే నైజా న్ని కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తోందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి తీవ్ర స్థాయి లో విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ యువరాజు దేశాన్నేలిన రాజులు, మహారాజులను అగౌరపరుస్తూ, నవాబులు, నిజాంలు, బాదీలపై అకృత్యాలపై మాత్రం నోరు మెద పరని విమర్శించారు.అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన ఔరంగజేబ్ను కాంగ్రెస్(Congress) పార్టీ ఏనాడూ విమర్శించిన పాపన పోలేదని అన్నారు. కర్ణాటకలోని బెళగవిలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీ లో మోదీ మాట్లాడారు.
భారతదే శాన్ని పరిపాలించిన రాజులు అకృ త్యాలు చేసి పేద ప్రజల ఆస్తు లు కొల్లగొట్టారని కాంగ్రెస్ షెహజాదా చెబుతుంటారని, సుపరిపాలన, దేశభక్తికి ప్రతీకలైన ఛత్రపతి శివాజీ మహరాజ్, రాణి చిన్నమ్మ వంటి గొప్ప యోధులను విమర్శిస్తుంటా రని అన్నారు. మనమంతా గర్వించే మైసూరు రాజకుటుంబం సేవలు షెహజాదాకు తెలియవా అని ప్రధాని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ ఇటీవల కర్ణాటకలో(Karnataka) జరిగిన ర్యాలీ లో ప్రజల భూములను రాజులు, పాలకులు లాక్కున్నారని, దేశానికి స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యాన్ని తీసుకువచ్చి రాజ్యాంగాన్ని అమలు చేసిన కాంగ్రెస్ పార్టీనే వీటిని అడ్డు కుందని చెప్పారు. ఆయన వ్యాఖ్య లపై మోదీ బెళగవి ప్రసంగంలో తూర్పారబడుతూ, కేవలం ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల కోసం కాంగ్రెస్ షెహజాదా( Shehzada)ఈ వ్యా ఖ్యలు చేస్తున్నారని అన్నారు. వేలా ది హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిన ఔరంగజేబ్ కాంగ్రెస్ పార్టీకి గుర్తుకు రాడని ఎద్దేవా చేశారు.
మన పర్యాటక స్థలాలను ధ్వంసం చేసి, సంపదను దోచుకుని, ప్రజల ను, గోవులను చంపిన వారిపై గొం తు పెగలదని అన్నారు. బనారస్ హిందూ యూనివర్శిటీకి(Hindu University) ఏర్పాటు చేసేందుకు బెనారస్ రాజు సాయం చేశారని, బీఆర్ అంబేడ్కర్లోని ప్రతి భను బరోడా మహారాజు గుర్తించా రని ప్రదాని వివరించారు.కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే శాం తి భద్రతలు క్షీణించడం మొదలైం దని విమర్శించారు.
ఈవీఎంల ట్యాంపరింగ్ లపై అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీకి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు అని అభివర్ణించారు. దేశ ప్రజాస్వామ్యా న్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిం చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమా పణ చెప్పాలని డిమాండ్ చేశారు.
PM Modi criticize on Congress party