PM Modi: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: 800 కేజీల తృణధాన్యాల(Cereals) తో 12 గంటలు శ్రమించి పీఎం మోదీ (PM Modi) చిత్రాన్ని గీసిన
చెన్నైకి చెందిన 13 ఏళ్ల బాలిక 12 గంటలు కష్టపడి 800 కేజీల తృణధాన్యంతో పీఎం నరేంద్ర మోదీ చిత్రాన్ని గీసి ప్రపంచ రికార్డు (World Record) సృష్టించింది.
దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద మిల్లెట్ పెయింటింగ్ (Millet Painting) గా ఇది యూనికో వరల్డ్ రికార్డుని సొంతం చేసుకుంది. ప్రెస్లీ షెకీనా అనే బాలిక సెప్టెంబరు 17న ప్రధాని మోదీ పుట్టినరోజును పురస్కరిం చుకొని తృణ ధాన్యాలతో 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భారీ చిత్రాన్ని రూపొందించింది. కాగా ప్రెస్లీ ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది.