Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

PM Modi: విదేశాల పర్యటనకు ప్రధాని మోదీ

–ఈ నెల 15వ తేదిన సైప్రెస్, 16న కెన‌డా, 18న క్రొయేషియా దేశాల్లో ప‌ర్య‌ట‌నలు

ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ:
PM Modi: పహల్గామ్ ఉగ్రదాడి తో పాటు ఆపరేషన్ సిం దూర్ తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు సన్నద్ధమవుతున్నారు. వచ్చేవారం కెనడాలో జరగబోయే జీ-7 సదస్సుకు ప్రధాని హాజరు కానున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా మోడీకి ఫోన్ చేసి ఆహ్వానించారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత కెనడా-భారత్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపద్యంలో తొలిసారి ప్రధాని మోడీ కెనడా వెళ్తున్నారు.

కెనడాతో పాటు ప్రధాని మోడీ సైప్రస్, క్రొయేషియా దేశాల్లో కూడా పర్యటిస్తారు. ఈ నెల 16-17 తేదీల్లో కెనడాలోని కననాస్కిస్‌‌లో జరిగే జీ- 7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో ఇంధన భద్రత, సాంకేతికత ఆవిష్కరణలతో సహా కీలకమైన ప్రపంచ సమస్యలపై భారతదేశం వైఖరిని ప్రధాన మంత్రి భారత వైఖరి తెలియచేస్తారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నెల 15 నుంచి 16 వరకు మోడీ సైప్రస్ పర్యటనలో ఉంటారు. ఆ తర్వాత 16-17 వరకు జీ-7 సమావేశంలో పాల్గొంటారు. దీని తర్వాత జూన్ 18న క్రొయేషియాలో పర్యటన కొనసాగించనున్నారు.