Election rules violation: ఎన్నోసార్లు ఎన్నికల నియమావళి ఉల్లంఘన
ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాల్లో 421 సార్లు మతపర, విభజనవాద వ్యాఖ్యలు చేయడం ద్వారా ఎన్నికల నియామ వాళ్ళని ఉల్లంఘించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.
ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ
421 సార్లు మత, విభజన పరమైన వ్యాఖ్యలు
ధ్యానం చేస్తే జ్ఞానం రాదంటూ ఎద్దేవా వ్యాఖ్యలు
జూన్ 4న ప్రత్యామ్నాయ ప్రభు త్వానికి తీర్పు వెలువడుతుంది
మీడియా సమావేశంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తన ప్రసంగాల్లో 421 సార్లు మతపర, విభజనవాద వ్యాఖ్యలు చేయడం ద్వారా ఎన్నికల నియామ వాళ్ళని ఉల్లంఘించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge)ఆరోపించారు. కులమతాల ఆధారంగా ఓట్లు(Votes) అభ్యర్థించ కూడదని ఎన్నికల సంఘం స్పష్ట మైన ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించారన్నారు. అయినా ఇసి ఎలాంటి చర్యలు తీసుకోలదే న్నారు. తాము కొన్ని సందర్భాల్లో ఫిర్యాదు చేశామని అన్నారు. లోక్ సభ ఎన్నికల తుదిదశ ప్రచారానికి చివరిరోజైన గురువారం ఆయన ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాల యంలో మీడియాతో మాట్లాడారు.
జూన్ 4న ప్రత్యామ్నాయ సర్కారు ఏర్పడేలా ప్రజలు తీర్పు ఇస్తారన్న నమ్మకం ఉందని చెప్పారు. గత 15 రోజుల్లో మోదీ తన ప్రసంగాల్లో 232 సార్లు కాంగ్రెస్(Congress) పేరును ప్రస్తా వించారు. 758 సార్లు సొంత పేరునే తలుచుకున్నారు. నిరుద్యోగ సమ స్య గురించి మాత్రం ఒక్కసారి కూ డా మాట్లాడలేదని ప్రధాని ప్రచార తీరును ఖర్గే ఎండగట్టారు. స్పష్ట మైన ఆధిక్యంతో ‘ఇండియా'(India) కూట మి అధికారంలోకి వస్తుందని ఆశా భావం వ్యక్తంచేస్తూ దేశానికి సమ్మిళి త, జాతీయవాద ప్రభుత్వాన్ని అందిస్తామన్నారు. ప్రస్తుత ప్రభు త్వానికి మరోసారి అవకాశమిస్తే ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడం ఖాయమనే అభిప్రాయం ప్రజల్లోనూ వ్యక్తమవుతోందన్నారు.
గాంధీపై(Gandhi) సినిమా తీసేవరకు ఆయన గురించి పెద్దగా తెలియదంటూ చేసిన వ్యా ఖ్యలు హాస్యాస్పదమని ఆ పారే శారు. గాంధీ గురించి బహుశా ఆయన చదివి ఉండకపోవచ్చు. కానీ, మహాత్ముడు ప్రపంచ వ్యాప్తం గా తెలుసు. ఐరాస సహా వివిధ ప్రదేశాల్లో బాపూజీ విగ్రహాలు ఉన్నాయి. ఒకవేళ మోదీకి(Modi) గాంధీ గురించి తెలియకపోతే రాజ్యాంగం గురించి కూడా పెద్దగా తెలియన ట్లేనని, జూన్ 4 తర్వాత ఎలాగో చాలా ఖాళీ సమయం దొరుకు తుందన్నారు. అప్పుడు గాంధీ ఆత్మకథ చదివి, ఆయన గురించి తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారానికి చివరి రోజున కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికా ర్జున్ ఖర్గే ప్రధాని మోదీపై తీవ్ర స్థాయి- లో మండిపడ్డారు. గాంధీ జీపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
మహాత్మా గాంధీ గురించి సినిమా చూసిన తర్వాత చాలామంది తెలుసుకు న్నారని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఖర్గే స్పందిస్తూ ప్రధానమంత్రి చదు వుకుని ఉంటే ఇలాంటి మాటలు చెప్పువారుకాదన్నారు. ఆయన ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తోందన్నా రు. గాంధీ గురించి ప్రధానికి తెలియ కపోతే రాజ్యాంగం గురించి కూడా తెలియదని అన్నారు. జూన్ 4 తర్వాత మోదీకి ఖాళీ సమయం దొరికితే గాంధీ ఆత్మకథ, సత్యంతో నా అనుభవాలు పుస్తకాలను తప్పక చదవాలన్నారు. ఇకపోతే ప్రధాని మోదీ రాజకీయాలు ద్వేషం తో నిండిపోయాయని విమర్శిం చారు. ఈ ఎన్నికలు చిరకాలం గుర్తుండిపోతాయని ఖర్గే పేర్కొన్నా రు. దేశంలోని ప్రతి పౌరుడు కుల, మతాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి ఓట్లు వేశారన్నారు.
మోదీ మాయమాటలను దేశ ప్రజలు నమ్మలేదన్నారు. జూన్ 4 తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం రాబోతుందని ఖర్గే తెలిపారు.కన్యాకుమారిలో(Kanyakumari)ప్రధాని మోదీ ధ్యానం చేయడానికి వెళ్ల డంపై ఖర్గే ఘాటుగా స్పందించారు. వివేకానంద కేంద్రంలో ధ్యానం చేయడం వల్లనో, గంగలో స్నానం చేయడం వల్లనో విజ్ఞానం లభించ దని, చదువుకోవడం ద్వారా జ్ఞానం లభిస్తుందన్నారు. కాంగ్రెస్ మేనిఫె స్టోను మతంతో ముడి పెట్టి బీజేపీ(BJP) మోడల్ కోడ్ కండక్టు ఉల్లంఘిం చిందని ఖర్గే పేర్కొన్నారు. ఎన్నికల కు ముందే కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల ను స్తంభింప చేశారన్నారు. మోదీ ప్రభుత్వం నియంతృత్వం వైపు వెళుతోందని, ఈ ప్రభుత్వం రాజ్యాంగంపై దాడి చేస్తుందని ఖర్గే విమర్శించారు.
PM Modi violation election rules