Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

RBIgovernor : ఆర్‌బీఐ గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా

బ్రేకింగ్…

ఆర్‌బీఐ గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా

ప్రజా దీవెన, న్యూ దిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) నూ తన గవర్నర్‌గా రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా (Sa n jay Malhotra) నియమి తులయ్యారు. ప్రస్తుత గవర్నర్‌ శక్తి కాం త దాస్‌ పదవీ కాలం రేపు డిసెంబర్‌ 10 ముగియడంతో తదు పరి గవర్నర్‌ను కేంద్రం నియమిచింది. 2018లో ఆర్‌బీఐ గవర్నర్‌ గా బా ధ్యతలు చేపట్టిన శక్తికాంత దాస్‌ పదవీ కాలం 2021లోనే ముగియ గా కేంద్రం మరో మూడేళ్లు పొడిగించింది.

ఈ గడువు కూడా డిసెంబర్‌ 10తో ముగియనుండ డంతో కొత్త గవ ర్నర్‌ను నియామ కానికి కేబినెట్‌ నియామకాల కమి టీ ఆమోదం తెలిపింది. మల్హోత్రా ఆర్‌బీఐకి 26వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్ట నున్నారు. డిసెంబర్‌ 11 నుంచి మూడేళ్ల కాలం పాటు ఆయన ఈ పదవిలో కొనసాగు తారు.సంజయ్‌ మల్హోత్రా 1990 బ్యాచ్‌ రాజస్థా న్‌ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఐఐటీ కాన్పూర్‌లో కంప్యూ టర్‌ సైన్స్‌లో ఇంజినీ రింగ్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఆయన అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ నుంచి పబ్లిక్‌ పాల సీలో మాస్టర్స్‌ అభ్యసించారు.

విద్యుత్‌, ఆర్థిక, పన్నులు, ఇన్ఫ ర్మేషన్‌ టెక్నాలజీ, మైన్స్‌ తదితర రంగాల్లో మూడు దశాబ్దాలకు పైగా సర్వీసులందించారు. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలోని రెవెన్యూ విభాగం కార్యదర్శిగా కొన సాగుతున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక, పన్నుల విషయం లో అపారమైన అను భవం కలిగిన ఆర్థిక, ట్యాక్సేషన్‌లో అపారమై న అనుభం కలిగిన సంజయ్‌ మల్హోత్రా ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు సం బంధించిన విధాన రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు.

RBIgovernor