Road Accident : ప్రజా దీవెన కర్ణాటక: కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయచూరు జిల్లా సింధనూరు సమీపంలో బుధ వారం తెల్లవారుజామున తుఫాన్ వాహనం బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ తో సహా నలుగురు విద్యా ర్థులు ప్రాణాలు కోల్పోయారు.వీరిలో ముగ్గురు కర్నూలు జిల్లా మంత్రాలయ వేదపాఠశాల విద్యా ర్థులుగా గుర్తించారు. మంత్రా ల యం వేదపాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థులు కర్ణాటకలోని హంపి క్షేత్రంలో జరుగుతున్న నర హరి తీర్థుల ఆరాధన కార్యక్రమా నికి తుఫాన్ వాహనంలో బయల్దే రారు.
ఈ క్రమంలో సింధనూరు సమీపంలో తుఫాన్ వాహనం బోల్తాపడింది.ఈ ఘటనలో డ్రైవర్ శివ సహా ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ముగ్గురు విద్యార్థులు అభిలాష, హైవదన, సుజేంద్రగా కర్నూలు జిల్లాకు చెందిన వారిగా గుర్తిం చారు.ఈ ఘటనపై మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వా మి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఈ ఘటనలో చనిపోయినవారి మృతదేహలకు పోస్ట్మార్టమ్ నిర్వహించిన తర్వా త స్వగ్రామాలకు తరలించనున్నా రు. ఇది ఇలా ఉండగా కడపటి సమాచారం అందే వరకు మొత్తం పదిమంది ఈ ప్రమాదంలో మృ త్యువాత పడ్డట్టు సమాచారం అం దుతోoది. పూర్తి సమాచారం అధికారికంగా అందాల్సి ఉంది.
ఘటనా స్థలాన్ని పరిశీలిం చిన పోలీసులు.. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.