Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Southwest monsoon: ఈశాన్యంలో ‘ నైరుతి ‘ ప్రవేశం

నైరుతి రానే వచ్చేసింది. కేరళ తీరాన్ని గురు వారం తాకడoతో ఎండలతో అల్లా డుతున్న వేళ దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి వార్త అం దించింది.

కేరళలో ప్రారంభమైన భారీ వర్షా లు14 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
వచ్చే వారంలోపు ఏపి, తెలంగాణ ల్లో ప్రవేశించే అవకాశం
చల్లటి కబురు అందించిన వాతావరణ శాఖ

ప్రజా దీవెన న్యూఢిల్లీ: నైరుతి రానే వచ్చేసింది. కేరళ(Kerala) తీరాన్ని గురు వారం తాకడoతో ఎండలతో అల్లా డుతున్న వేళ దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ(Department of Meteorology)చల్లటి వార్త అం దించింది. నైరుతి రుతుపవనాలు గురువారం ఉదయం కేరళను తాకి నట్లు ఐఎండీ అధికారికంగా ప్రకటిం చింది. కేరళ సహా ఈశాన్య రాష్టాల్రను నైరుతి పవనాలు తాకినట్లు అధికా రులు తెలిపారు. ఈ ప్రభావంతో కేరళవ్యాప్తంగా భారీ వర్షాలు కురు స్తుoడగా 14 జిల్లాల్లో ఎల్లో అలర్ట్(Yellow alert)జారీ చేశారు. వారంలో తెలుగు రాష్టాల్లో ప్రవేశించనున్నట్లు చెప్పా రు. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాం తాలకు రుతు పవనాలు విస్తరిం చేందుకు పరిస్థితులు అనుకూ లంగా ఉ న్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది.

నాలుగైదు రోజుల్లో రుతు పవనాలు రాయలసీమలోకి(Rayalaseema) ప్రవేశించే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. వారం ముందుగానే రుతుపవనాల పురోగమనంతో ఈ ఏడాది సమృ ద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉం దని అధికారులు తెలిపారు. గతేడా ది కంటే ఈసారి ముందుగానే నైరు తి పవనాలు కేరళను తాకాయి. దేశ ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వం లో నైరుతి పవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. మన దేశంలో 52శాతం నికర సాగుభూమికి ఇప్పటికీ వర్ష పాతమే ఆధారమే. ఈ సాగు భూమి నుంచి ఏకంగా 40 శాతం వ్యవసాయ ఉత్పత్తులు దిగుబడి అవుతాయి. అటు ఈ ఏడాది లానినా అనుకూల పరిస్థితులు, భూమధ్యరేఖ వద్ద పసిఫిక్ మహా సముద్రం(Pacific Ocean)చల్లబడడం, ఆగస్ట్- సెప్టెంబర్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉన్న క్రమంలో ఈసారి సీజన్ లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు గత నెలలోనే అంచనా వేశారు.

వాయు వ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కు వ వర్శపాతం నమోదయ్యే అవకా శం ఉందని పేర్కొన్నారు. 1951 నుంచి 2023 వరకూ ఎల్నేని తర్వాత లానినా వచ్చిన సంద ర్భాల్లో భారత్ లో తొమ్మిదిసార్లు మంచి వర్షాలు కురిశాయని, ఈ ఏడాది కూడా రుతుపవనాలు(Monsoons)కదలిక అనుకూలంగా ఉందని వివరించారు. సాధారణంగా ఈశాన్య భారతంలో జూన్ 5కు అటు, ఇటుగా రుతు పవనాలు ప్రవేశిస్తాయి. కానీ ఈసారి మే 30నే ప్రవేశించాయి. రేమాల్ తుఫాను ప్రభావంతో రుతు పవనాలు వేగం గా కేరళను తాకినట్లు వాతావరణ శాఖ నిపుణులు వెల్లడిస్తున్నారు.

Southwest monsoon in North-East India