Sunita Williams : ప్రజా దీవెన వాషింగ్టన్: నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు దాదాపు తొమ్మిది నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో గడిపిన తర్వాత, మార్చి 19, 2025న భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉందని తీపి కబు రు అందుతోంది. వాస్తవానికి, 202 4 జూన్ 6న బోయింగ్ స్టార్లై నర్ క్యాప్సూల్ ద్వారా ఐఎస్ఎస్కు వె ళ్లిన వీరు, సాంకేతిక సమస్యల కా రణంగా తిరిగి రాలేకపోయారు. హీలియం లీకేజీ వంటి సమస్యల వల్ల, వారి మిషన్ 8 రోజుల నుంచి 9 నెలల వరకు పొడిగించబడింది.
మార్చి 12న స్పేస్ఎక్స్కు చెందిన క్రూ-10 మిషన్ను లాంచ్ చేయను న్నారు. ఈ మిషన్లో నాసా వ్యోమ గాములు అన్నే మెక్క్లెయిన్, నికోల్ ఏయర్స్, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్ల రేషన్ ఏజెన్సీ వ్యోమగామి టకు యా ఒనిషి, రోస్కోస్మోస్ కాస్మో నాట్ కిరిల్ పెస్కోవ్లు పాల్గొం టారు. క్రూ-10 సిబ్బంది ఐఎస్ ఎస్కు చేరుకున్న తర్వాత, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు క్రూ -9 మిషన్తో భూమికి తిరిగి వస్తా రు. అంతరిక్షంలో దీర్ఘకాలం గడ పడం వల్ల వ్యోమగాములు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మైక్రోగ్రావిటీ పరిసరాలలో ఎక్కువ కాలం ఉండడం వల్ల కండ రాల బలహీనత, ఎముకల సాంద్ర త తగ్గడం, కంటి సమస్యలు వంటి సమస్యలు తలెత్తవచ్చు. అయితే, నాసా ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని, సునీతా విలియమ్స్, బు చ్ విల్మోర్ల భూమికి తిరిగి రాకను సురక్షితంగా నిర్వహిం చేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.
మొత్తం మీద, సునీతా విలియ మ్స్, బుచ్ విల్మోర్ల భూమికి తి రిగి రాకకు మార్గం సుగమం అయింది. మార్చి 19న వీరు భూమిని చేరుకొని, తమ కుటుం బాలతో మళ్లీ కలుసుకోనున్నారు.