–విడాకులు తీసుకున్న వాళ్లు కూడా అర్హులే
–సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక తీర్పు
Supreme Court: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ముస్లిం మహిళలకు (Muslim women) భరణం (alimony) విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరిం చింది. విడాకుల తర్వాత కూడా వారు భరణానికి అర్హులే అని తేల్చి చెప్పింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 అందుకు అవకాశం కల్పిస్తుందని స్పష్టంచేసింది. విడా కులు తీసుకున్న తన భార్యకు భర ణం చెల్లించాలంటూతెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టు లో పిటిషన్ (Petition) వేశారు. దీనిని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టెన్ జార్జ్ మాసిహ్ లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
మతాలకు సంబంధం లేకుండా భరణం (alimony) పొందే హక్కు ప్రతి మహిళకీ ఉంటుందని స్పష్టం చేసిం ది. విడాకుల (divorce) తర్వాత ప్రతి నెలా రూ.10వేల భరణం చెల్లించాలని పిటిషనర్ ను ఆదేశించింది. ‘ఇంటి పట్టున ఉండే భార్య తమపైనే ఆధా రపడి ఉంటుందన్న కనీస ఇంగితం కూడా కొంతమంది భర్తలకు ఉండ డం లేదు. ఎమోషనల్ గా కూడా అలాంటి మహిళలు భర్తపైనే ఆధా రపడి ఉంటారు. ఇప్పటికైనా హౌజ్ వైఫ్ (house wife)ల విలువని, వాళ్లెంత త్యాగా న్ని చేస్తున్నారో పురుషులు అర్థం చేసుకోవాలి’ అని సుప్రీం కోర్టు నర్మగర్భంగా వ్యాఖ్యానించింది.