Phone tapping issue: ఫోన్ టాపింగ్ పై కేంద్రానికి రాష్ర్ట బిజెపి ఫిర్యాదు
తెలంగాణ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రికి రాష్ట్ర బీజేపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు.
ట్యాపింగ్పై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
గత ప్రభుత్వ కుంభకోణాలపై సీబీఐతో దర్యాప్తు జరపాల్సిందే
బీజేపీ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు, మా జీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: తెలంగాణ లో ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) వ్యవహారంపై కేంద్ర హోంమంత్రికి రాష్ట్ర బీజేపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. తెలంగాణలో బయటపడుతున్న గత ప్రభుత్వ కుంభకోణాలపై సీబీ ఐతో దర్యా ప్తు జరపాలని బీజేపీ(BJP) రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మె ల్యే ఎన్వీఎ స్ఎస్ ప్రభాకర్ డిమాం డ్ చేశారు. గత ప్రభుత్వ కుంభకో ణాలు బయట పడుతున్నా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడటం లేదని, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ను రాజకీ యంగా ఉపయో గించుకునే అవకా శం ఉందని ఎన్వీ ఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. సివిల్ సప్లైస్లో జరిగిన అక్రమాలు వెలు గులోకి వస్తున్నా యన్నారు.
అక్రమాలు, కుంభకో ణాలు వెలుగులోకి వ స్తున్నా సీబీఐ(CBI) దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం కోర కపోవడాన్ని ఆయన తప్పుబడుతు న్నారు. సివిల్ సప్లైస్ కుంభకోణాన్ని సీబీఐతో దర్యాప్తు జరపాలన్నారు. అనేక ప్రముఖులు, జడ్జీలు ఫోన్ ట్యాపింగ్ అయ్యాయ ని వార్తలు వచ్చాయన్నారు. దుబ్బా క ఎన్నికల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ట్యాపింగ్ చేశారని, డీజీపీపై ప్రస్తుత ప్రభు త్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి చాలా తేలికగా తీసుకున్నట్లు కని పిస్తోందన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియాగాంధీని పిల వడంపై రాష్ట్ర బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోందని అన్నారు.
వందల మంది బలిదానాలకు సోనియా గాంధీయే కారణమని, తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ(Sonia Gandhi) క్షమాప ణలు చెప్పి దశాబ్ది వేడుకలకు రావాలని అన్నా రు. రాష్ట్ర ప్రభు త్వం అధికారికంగా వేడుకలు నిర్వహిస్తున్నపుడు అప్ప టి ప్రధాని ,పార్లమెంట్లో మద్దతు ఇచ్చిన పార్టీలను ఎందుకు ఆహ్వా నించడం లేదని ఆయన ప్రశ్నించా రు. తెలంగాణ(Telangana) ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన పార్టీలను ఆహ్వానించన ప్పుడు అది పార్టీ కార్యక్రమం అవు తుందన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి సహా అనేక మంది బీజేపీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యా యని, ఫోన్ ట్యాపింగ్పై సీబీఐ దర్యాప్తు లేదా సిట్టింగ్ జడ్జితో విచా రణ జరపాలని డిమాండ్ చేశారు. గతంలో డ్రగ్స్,పేపర్ లీకేజీల, నయి మ్ వ్యవహారం వచ్చినపుడు వాటి ని కేసీఆర్ రాజకీయంగా ఉపయో గించుకున్నారన్నారు.తెలంగాణ దశాబ్ది వేడుకలకు రాష్ట్ర ప్రభు త్వం అఖిలపక్షం, ఉద్యమకారులు, తెలంగాణ వాదులతో చర్చలు జర పలేదని విమర్శించారు. సోనియా ను పిలవడం ఆపి మిగతా పక్షాల తో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జర పాలన్నారు. రాష్ట్ర చిహ్నం బయట కు వచ్చిన తరువాత రాష్ట్ర బీజేపీ నాయకత్వం సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటుందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ స్పష్టం చేశా రు.
telangana bjp complaint modi phone tapping