Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Delhi natural disaster :తీవ్ర విషాదం, ఢిల్లీలో ప్రకృతి ప్రకో పంతో నలుగురు దుర్మరణం

Delhi natural disaster :ప్రజా దీవెన న్యూ ఢిల్లీ: దేశ రాజ ధాని ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో (ఎన్‌సీఆర్) శుక్రవారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షం తీవ్ర విషాదం నింపింది. ఉరుములు, మె రుపులు, వడగళ్లు, బలమైన ఈ దురు గాలులతో కూడిన వర్షం కా రణంగా ద్వారక ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబా నికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

బలమైన గాలుల ధాటికి ద్వారకా ప్రాంతంలోని ఓ వ్యవసాయ భూ మిలో ఉన్న బోరు బావి గదిపై పెద్ద వేప చెట్టు కుప్పకూలింది. దీంతో అందులో ఉన్న 26 ఏళ్ల మహిళ, ఆమె ముగ్గురు పిల్లలు శిథిలాల కింద చిక్కుకుపోయారు.

సమాచారం అందుకున్న పోలీసు లు, అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహా యక చర్య లు చేపట్టారు. శిథిలాల ను తొలగించి నలుగురినీ బయట కు తీసి, సమీపంలోని ఆర్‌టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అయితే, వారు అ ప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘట నలో మృతురాలి భర్త అజయ్‌కు స్వల్ప గాయాలయ్యాయి.