కోహ్లీ బ్రేకింగ్, సచిన్ రికార్డు బీట్
ViratKohli : ప్రజా దీవెన, షార్జా: భారత క్రికెట్ జట్టు సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయిని చేరు కున్నాడు. ఆదివారం పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో దిగ్గజ ఆ టగాడు సచిన్ టెండూల్కర్ రికా ర్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. వన్డే ల్లో అత్యంత వేగంగా 14,000 పరు గుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
విరాట్ కోహ్లీ నేటి మ్యాచ్ తో కలిపి 299 వన్డేలు ఆడాడు. 287 ఇన్నిం గ్స్ల్లో 57.8 సగటుతో 14008 పరుగులు చేశాడు. ఇందులో 50 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే సచిన్ 14 వేల పరుగుల మైలురాయిని 350 వన్డే ఇన్నింగ్స్ల్లో చేరు కున్నా డు.ఇక వన్డేల్లో ఇప్పటి వరకు ఇద్దరు మాత్ర మే 14 వేలకు పైగా పరుగులు సా ధించారు. సచిన్ టెండూల్కర్ 18, 426 పరుగులతో అగ్రస్థానంలో ఉం డగా, శ్రీలంక దిగ్గజం కుమార సంగ క్కర 14,234 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ జాబితాలో కోహ్లీ మూడో ప్లేయ ర్గా నిలిచాడు.
వన్డేల్లో 14000 పైగా రన్స్ చేసి న ఆటగాళ్లు… సచిన్ టెండూ ల్కర్ (భారత్) 18,426 పరుగులు, కుమార సంగక్కర (శ్రీలంక) 14, 23 4 పరుగులు, విరాట్ కోహ్లీ (భార త్) – 14, 008 పరు గులు.