YouTube : ప్రజా దీవెన, మదురై: సామాజిక మాధ్యమాల ప్రభావం రోజురోజుకు శృతిమించుతోంది. ఇందుకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మధురై నగరం లో జరిగిన ఓ సంఘటన సాక్షాత్కా రంగా నిలుస్తోంది. ఈ రోజుల్లో మనుషుల జీవితంపై చాలా ప్రభా వం చూపిస్తుందో ఇది నిలువెత్తు నిదర్శనం. మనకు తెలియని ఎన్నో వింతలు, విషయాలు, విశేషాలను కూడా సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. మనకు ఏదైన అనుమానం వచ్చి నప్పుడు వెంటనే యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా తెరిచి అనేక విషయాలను నేర్చుకుంటు న్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి యూ ట్యూబ్ చూసి తనకు తానే ఆపరే షన్ చేసుకున్నాడు. ఈ వార్త తెలి సిన నెటిజన్లు నోరెళ్లపెడుతున్నా రు. వివరాలలోకి వెళితే తీవ్ర కడు పునొప్పితో బాధపడుతున్న ఓ వ్య క్తి యూట్యూబ్లో వీడియోలు చూ సి తనకు తానే ఆపరేషన్ చేసుకో వాలని నిర్ణయించుకున్నాడు.తన పొట్టను కోసి సర్జరీ చేసేందుకు ప్ర యత్నించగా విఫలమై తీవ్ర రక్తస్రా వమైంది. అతడిని గమనించిన కు టుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ మథురలో జరిగింది. అతడి పేరు రాజాబాబు కాగా, వయసు 32 సంవత్సరాలు. సున్ రాక్ గ్రా మంలో నివాసం ఉంటున్న రాజా బాబు కొంత కాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నా డు.
చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్లి చూపించుకున్నా కూడా అత డి కడుపు నొప్పి మాత్రం తగ్గలేదు. ఏ డాక్టర్ కూడా అతడికి నయం చే యలేకపోయాడు.దీంతో రాజాబా బు సంచలన నిర్ణయం తీసుకు న్నాడు. తనకు తానే కడుపు కోసు కుని ఆపరేషన్ చేసుకోవాలని డిసై డ్ అయ్యాడు.సర్జరీ ఎలా చేయా లో యూట్యూబ్ లో వీడియోలు చూశాడు. మథురకు వెళ్లి ఆపరేష న్ కు అవసరమయ్యే సర్జికల్ బ్లేడ్ లు, కుట్లు వేసుకునే నీడిల్స్, మత్తు ఇంజెక్షన్లు తెచ్చుకున్నాడు. ఇక యూట్యూబ్ లో కొన్ని సర్జరీ వీడి యోలు చూసి పొట్టపై 7 ఇంచుల మేర కోసి. పొట్టలో నోప్పికి గల కా రణాన్ని వెతికాడు. అతడికి ఏమీ కనిపించలేదు. దాంతో 11 ఇంచు లు మేర కట్ చేశాడు. నొప్పి ఇంకా ఎక్కువ కావడంతో కుటుంబ స భ్యులకు చెప్పాడు. దీంతో వాళ్లు హుటాహుటిన రాజాబాబును ఆస్పత్రికి తరలించగా, ఇతగాడు చేసిన పనిని చూసి వైద్యులు షాక్ అయ్యారు. ఇక మెరుగైన చికిత్స కోసం ఆగ్రాలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కం డీషన్ నిలకడగా ఉందన్నారు. రాజా బాబుకు దాదాపు 18 ఏళ్ల క్రితం అపెండిసైటిస్ ఆపరేషన్ జరి గింది. అయిన గత కొన్ని రోజులు గా కడుపు నొప్పి అతనిని చాలా వేధిస్తుందని రాజబాబు మేనల్లుడు తెలియజేశారు.