Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MURDER : కందుకూరులో దారుణం, ప్రియుడి తో కలిసి భర్తను కడతేర్చిన భార్య

MURDER :ప్రజా దీవెన, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో ఒక విషాదకరమైన సం ఘ టన చోటుచేసుకుంది. కందుకూరు మండలం దన్నారం గ్రామంలో ఓ మహిళ తన వివాహేతర సంబం ధం కారణంగా భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దన్నారం గ్రామానికి చెందిన ప్రవీణ్, ప్రమీల దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా ప్రమీలకు మరో వ్యక్తితో వివాహేతర సంబం ధం ఏర్పడింది. ఈ విషయంపై భా ర్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపా రు.

శుక్రవారం అర్ధరాత్రి ప్రమీల తన ప్రి యుడితో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న ప్రవీణ్‌కు ఉరివేసి హత్య చేసింది. అనంతరం అది ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం చేసింది. అయి తే, ప్రవీణ్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అతని తల్లిదండ్రులు, గ్రామస్థులు కందుకూరు పోలీసు లకు సమాచారం అందించారు.

వెంటనే ఘటనా స్థలానికి పోలీసు లు చేరుకుని మృతదేహాన్ని పరిశీ లించారు. ప్రమీల ప్రవర్తనపై అను మానం రావడంతో ఆమెను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వె లుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నారు.