Chief Minister A. Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రంలో ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్ర మ సరఫరాపై ఉక్కుపాదం మో పాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. కఠిన చర్యలతో నే అక్రమాలను అడ్డుకోగలమని, ప్రభుత్వానికి ఆదాయం పెంచగల మని చెప్పారు.గనుల శాఖపై ఇం టిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత నెల రోజులుగా తీసుకున్న చర్యల తో ఇసుక అక్రమ రవాణాకు అడ్డు కట్ట పడిన విధానాన్ని, పెరిగిన ఆ దాయాన్ని అధికారులు సీఎంకి వివ రించారు. ఈ సందర్భంగా ఇసుక రీచ్ల్లో తవ్వకాలు, రవాణా, విని యోగదారులకు తక్కువ ధరకు ఇసుక సరఫరాపై అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.ప్రభుత్వంలోని నీటి పారు దల, ఆర్ అండ్ బీ, పంచాయతీరా జ్తో పాటు వివిధ శాఖల ఆధ్వ ర్యంలో చేప్టటే పనులకు, పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టే సంస్థలకు అవ సరమైన ఇసుకను తెలంగాణ ఖని జాభివృద్ధి సంస్థ (TGMDC) నుంచే సరఫరా చేసేలా చూడాలన్నారు.
సరైన ధరలకు ప్రభుత్వమే ఇసుక సరఫరా చేస్తే వినియోగదారులు అక్రమంగా సరఫరా చేసే వారిపై ఆధారపడరని అన్నారు. హైదరా బాద్ నగరంతో పాటు సమీప ప్రాంతాల్లోనే ఇసుక ఎక్కువగా వినియోగం జరుగుతోందన్నారు. తక్కువ మొత్తంలో ఇసుక అవసర మైన వారు కొనుగోలు చేసేలా నగ రానికి మూడు వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.గనుల శాఖ పరిధిలో ని వివిధ ఖనిజాల క్వారీలకు గ తంలో విధించిన జరిమానాలు, వాటి వసూళ్లపైనా సీఎం అధికా రులను ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన విధానపరమైన నిర్ణయం త్వరగా తీసుకొని సమ స్యను పరిష్కరించాలని చెప్పారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నఖ నిజాల మైనర్ బ్లాక్ల వేలానికి వెంటనే టెండర్లు పిలవాలని ఆ దేశించారు. ఈ సమావేశంలో ము ఖ్యమంత్రి సలహాదారు వేం నరేం దర్ రెడ్డి, టీజీఎండీసీ ఛైర్మన్ ఈర వత్రి అనీల్, ఇతర ఉన్నతాధికా రులు పాల్గొన్నారు.