–కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు సీపీఎం పార్టీ హితవు
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:
CPM Criticises Congress: నల్గొండ నియోజకవర్గ ప్రజాసమస్యల (Nalgonda Constituency Public Issues) పరిష్కారానికి దృష్టి పెట్టకుండా కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం (CPM district committee member MD Salim) అన్నారు. శుక్రవారం దొడ్డి కొమురయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లగొండ నియోజక వర్గం అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రజా సమస్యల పరిష్కారం గురించి ఆలోచించకుండా కాంగ్రెస్ బిఆర్ఎస్ లు తిట్ల పురాణం తోటి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు.
1997 నంద్యాల నరసింహారెడ్డి ఎమ్మెల్యే ఉన్న కాలంలో సందెనపల్లిలో గొర్రెల మేకల అమ్ముకోవడానికి సంత ఆయుర్వేద మొక్కల ప్లాంటేషన్ (Plantation of Ayurvedic plants) కోసం కొనుగోలు చేసిన భూమిని కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అది డంపింగ్ యార్డ్ గా మార్చింది. కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. దాని నుండి వచ్చే కాలుష్యాన్ని నివారించడానికి శాస్త్రీయ పద్ధతి ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. 2004 -05 సంవత్సరంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చైర్మన్లు ఆ స్థలాన్ని డంపింగ్ యార్డ్ (Dumping Yard)గా మార్చిన కాంగ్రెస్ వారే ఇప్పుడు కూతలు కోస్తున్నారని అన్నారు. అప్పుడు ఆ భూమిని దేనికి కొనుగోలు చేశారు తాసిల్దార్ ఆఫీస్ లో రికార్డ్స్ ఉంటాయి పరిశీలించుకోవాలని అన్నారు.
సీపీఎం ఒకసారి ఎమ్మెల్యే గెలిచి నల్గొండ నియోజకవర్గంలో విద్యా వైద్యం రవాణా మంచినీటి ట్యాంకుల నిర్మాణాలకు ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు సుమారు 5 వేల మందికి ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇప్పించారని అన్నారు. గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు ఎక్కడా ఎకరం భూమి కొనుగోలు చేసి పేదల ఇండ్ల కోసం పంపిణీ చేసిన దాఖలాలు లేవని అన్నారు. 14 కోట్ల నిధులతో ఉదయ సముద్రాన్ని మంచినీటి చెరువుగా మార్చి జిల్లా ఫ్లోరిన్ రైతు ప్రాంతంగా ప్రయత్నం చేశారని గుర్తు చేశారు పట్టణ నడిబొడ్డులో ఉన్న ప్రకాశం బజార్ 220 దుకాణాలను అమ్ముకోవడం కోసం కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు ఒకే నిర్ణయంతో ప్రభుత్వా ఆస్తులను ధ్వంసం చేయడానికి ఒకే నిర్ణయంతో ఉన్నాయని అన్నారు .2007లో నల్గొండ పట్టణం లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన అండర్గ్రౌండ్ డ్రైనేజీ (Underground drainage) నేటికీ పూర్తి కాలేదని కొత్త ప్రాంతాలకు విస్తరణ పేరుతో మరో వంద కోట్లు పనులు చేపడుతున్న అది ప్రజా ఉపయోగము లేదని అన్నారు.
ఇరు పార్టీలు తిట్ల పురాణంతో ప్రజల దృష్టి మళ్లించే కార్యక్రమం ఇది అని అన్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు మానుకొని పట్టణ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశం (Press conference)లో సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు పుచ్చకాయల నర్సిరెడ్డి, తుమ్మల పద్మ , పట్టణ కమిటీ సభ్యులు గాదె నరసింహ,అద్దంకి నర్సింహ, మారగోని నగేష్, కోట్ల అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.